న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం కాలం నుంచి మెల్లమెల్లగా డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయి. గత 4 సంవత్సరాల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్స్పేస్ (యూపీఐ) లావాదేవీలు 1200 రెట్లు పెరిగాయి. 2020-21లో దీని ద్వారా రూ.41 లక్షల కోట్ల లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యూపీఐ విధానాన్ని కేంద్రం 2016 ఆగస్టులో ప్రారంభించింది.
కరోనా కాలంలో డిజిటల్ లావాదేవీలు పెద్ద మొత్తంలో జరిగాయి. 2020-21 సంవత్సరంలో యూపీఐ ద్వారా 2,233 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి ద్వారా మొత్తం రూ.41 లక్షల కోట్లు లావాదేవీలు జరిగాయి. గత నాలుగేండ్లలో లావాదేవీలు 1200 రెట్లు పెరిగినప్పటికీ వాటి విలువ 50 రెట్లకు మాత్రమే చేరాయి. యూపీఐ ప్రారంభించిన తొలి సంవత్సరంలో అంటే 2016-17లో మొత్తం 1.8 కోట్ల లావాదేవీల ద్వారా రూ.0.7 లక్షల కోట్లు లావాదేవీలు జరిగాయి. 2017-18 లో ఈ ట్రాన్జాక్షన్ల సంఖ్య ఏకంగా పెరిగిపోయింది. అయితే లావాదేవీల మొత్తం మాత్రం పెరుగలేదు. ఆ ఏడాదిలో కేవలం 1.1 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి.
ఇక 2018-19 లో 535.3 కోట్ల ద్వారా రూ.8.8 లక్షల కోట్ల లావాదేవీలు, 2019-20లో 1251.9 కోట్ల ట్రాన్జాక్షన్ల ద్వారా రూ.21.3 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. 2020-21లో మొత్తం 2233.1 కోట్ల లావాదేవీలు జరగ్గా.. రూ.41 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు పూర్తయ్యాయి. అంటే, గత 4 సంవత్సరాలలో లావాదేవీలు దాదాపు 1200 రెట్లు పెరిగాయి. కాని వాటి ద్వారా డబ్బు లావాదేవీల విలువ 50 రెట్లు మాత్రమే పెరిగింది. కొన్నేళ్లుగా చిన్న లావాదేవీల సంఖ్య వేగంగా పెరిగిందని ఈ గణాంకాలు చూపిస్తున్నాయి.
సివిల్స్ 2020 : ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
35 ఏండ్ల క్రితం : లార్డ్స్లో తొలి టెస్ట్ విజయం చిరస్మరణీయం
ఇంద వంద : గడ్డం కాదు మోదీజీ, ఉపాధి పెంచండి..
మా పెళ్లి చెల్లదు : భర్త నుంచి విడిపోయిన ఎంపీ నుస్రత్
పెద్ద పొరపాటు : నోరు జారిన కేంద్ర మంత్రి గడ్కరీ
కొత్త రికార్డ్ : పది మందికి జన్మనిచ్చిన సౌతాఫ్రికా మహిళ
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..