పుణె : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గడ్డంపై ఇప్పటికే చాలా జోకులు పేలుతున్నాయి. ఈ గడ్డం కథేంటో అని గొణుక్కున్న వారూ ఉన్నారు. మోదీ గడ్డం శైలిని నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్తో అభిమానులు పోలుస్తుండగా.. ఈ శైలిని ఇష్టపడని ఇంకొందరు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
మోదీ గడ్డంను చూసిన పుణె సమీపంలోని బారామతికి చెందిన చాయ్వాలా అనిల్ మోరేకు కోపం వచ్చిందో..? ఏమో..? గడ్డం తీసుకోవాలంటూ ఏకంగా మోదీకి రూ.100 మనియార్డర్ చేశాడు. అంతటితో ఆగకుండా మోదీజీ పెంచాల్సింది గడ్డం కాదు.. ఉపాధి పెంచండి, టీకాలు పెంచండి, కొవిడ్తో మరణించిన కుటుంబాలకు పరిహారం పెంచండి.. అంటూ విజ్ఞప్తి చేశారు.
అనిల్ మోరే ‘టీ హౌస్’ పేరుతో బారామతి ఇందపూర్ రోడ్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ వద్ద టీ స్టాల్ నడుపుతున్నాడు. “దేశం కరోనా మహమ్మారితో పోరాడుతున్నది. దేశంలో ప్రజలు చనిపోతున్నారు. ఎందరివో ఉద్యోగాలు పోతున్నాయి. కానీ ప్రధాని మోదీ మాత్రం తన గడ్డాన్ని పెంచుకుంటున్నారు. ఆయన ఏదో పెంచాలనుకుంటే.. ప్రజలకు ఉపాధి పెంచాలి, టీకాలను పెంచాలి. నా సంపాదన నుంచి రూ.100 మోదీజీకి పంపుతున్నాను. ఈ మొత్తాన్ని గడ్డం తొలగింపునకు వాడితే సంతోషిస్తాను. మోదీ గొప్ప నాయకుడు. ఆయనను గౌరవిస్తాం. ఆయనను బాధించాలని ఇలా చేయడం లేదు. కరోనా కారణంగా పెరుగుతున్న సమస్యలపై దృష్టి సారించి ఉపాధి పెంచితే దేశం బాగుపడుతుంది” అని అనిల్ మోరే విజ్ఞప్తి చేశారు.
మా పెళ్లి చెల్లదు : భర్త నుంచి విడిపోయిన ఎంపీ నుస్రత్
పెద్ద పొరపాటు : నోరు జారిన కేంద్ర మంత్రి గడ్కరీ
నయా దోపిడీ : నకిలీ యాప్తో 5 లక్షల మందికి 150 కోట్ల మోసం
మమత డిమాండ్ : కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాల్సిందే..!
కొత్త రికార్డ్ : పది మందికి జన్మనిచ్చిన సౌతాఫ్రికా మహిళ
ఓపెన్ లెటర్ : స్కాలర్షిప్ కోసం బిర్సా కుటుంబీకుల వినతి
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
మంచి డిక్రీ : వ్యాక్సిన్ వేసుకోని వారికి గ్రామ బహిష్కరణ
సమష్ఠి విజయం : తొలి మాస్క్ రహిత దేశంగా ఇజ్రాయెల్
చరిత్రలో ఈరోజు.. గిరిజనుల ఆరాధ్యదైవం బిర్సా ముండా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..