న్యూఢిల్లీ: కమర్షియల్ ఎల్పీజీ(Commercial LPG) సిలిండర్ ధరలను తగ్గించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం తమ ధరలను తగ్గిస్తూ ప్రటకన చేశాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్పై రూ.200 తగ్గిస్తున్నట్లు కంపెనీలు వెల్లడించాయి. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత రెండో సారి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించారు. మరో వైపు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లేదా జెట్ ఇంధనాన్ని.. లీటరకు రూ.5 పెంచేశారు. ఇప్పుడు ఆ ఇంధన ధర లీటర్కు రూ.115 అయ్యింది. స్వదేశీ విమానాల ఇంధనం ఖర్చు దీంతో మరింత పెరగనున్నది. 19 కేజీల సిలిండర్పై 200 తగ్గడం వల్ల .. రెస్టారెంట్లు, హోటళ్లకు కొంత ఊరట కలిగింది. ఢిల్లీ, కోల్కతాలో 200 కన్నా ఎక్కువే తగ్గింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త ధర అమలులోకి వస్తుంది. కానీ గృహ అవసరల కోసం వినియోగించే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరను మాత్రం తగ్గించలేదు.