జోహన్నెస్బర్గ్ : సాధారణంగా కవలలు పుట్టడం, లేదంటే ముగ్గురు పిల్లల్ని కనడం మనం సాధారణంగా చూస్తుంటాం. ఇటీవల ఓ మహిళ ఏకంగా ఏడుగుర్ని కన్నదంటే గుండెలపై చేయి వేసుకుని.. బాప్రే! అని నిట్టూర్చాం. ఇప్పుడు దక్షిణాఫ్రికాకు చెందిన ఓ 37 ఏండ్ల మహిళ సరాసరి పది మందికి జన్మనిచ్చి గత ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది.
సౌతాఫ్రికాకు చెందిన గోసియామ్ తమరా సిథోల్ అనే మహిళ గర్భం దాల్చింది. అయితే, ఆరో నెలలో పరీక్షించిన వైద్యులు కనీసం ఎనిమిది మందికి జన్మనిచ్చి ఆక్టోమామ్ అవుతారని అనుకున్నారు. అయితే, సోమవారం నాడు ఆమె ప్రిటోరియా దవాఖానలో 10 మంది శిశువులకు జన్మనిచ్చింది. సిజేరియన్ నిర్వహించి 10 మందిని క్షేమంగా బయటకు తీసారు. వీరిలో ఏడుగురు బాలురు ఉండగా.. ముగ్గురు బాలికలు ఉన్నారు. వీరంతా ఆరోగ్యంగా ఉన్నారని, అయితే వారిని మరికొన్ని రోజులపాటు ఇదే దవాఖానలోని ఇంక్యుబేటర్లలో ఉంచి సంరక్షించనున్నట్లు దవాఖాన యాజమాన్యం తెలిపింది.
ప్రిటోరియా దవాఖానలో సిజేరియన్ ద్వారా 10 మంది శిశువులను ప్రసవించడంతో చాలా ఆశ్చర్య పోయామని సిథోల్ భర్త టెబోహో సోటెట్సీ తెలిపారు. ఏడు నెలల ఏడు రోజులకే ప్రసవ నొప్పులు రావడంతో ప్రిటోరియాలోని వైద్యులను సంప్రదించామని, ఈ మేరకు సోమవారం పది మందికి జన్మనిచ్చిందని, ఇది నాకు షాకింగ్గా ఉన్నదని సోటెట్సీ అన్నారు. కాగా ఈ మహిళకు ఇప్పటికే ఆరేండ్ల వయసున్న కవలలు ఉన్నారు.
ఓపెన్ లెటర్ : స్కాలర్షిప్ కోసం బిర్సా కుటుంబీకుల వినతి
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
మంచి డిక్రీ : వ్యాక్సిన్ వేసుకోని వారికి గ్రామ బహిష్కరణ
సమష్ఠి విజయం : తొలి మాస్క్ రహిత దేశంగా ఇజ్రాయెల్
చరిత్రలో ఈరోజు.. గిరిజనుల ఆరాధ్యదైవం బిర్సా ముండా
మళ్లీ ఉద్రిక్తత : తూర్పు లడఖ్లో 22 చైనా యుద్ధ విమానాల విన్యాసాలు
ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వస్తుంటాయి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..