కోల్కతా: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా తృణమూల్ కాంగ్రెస్ నిలుస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. రైతులు చేస్తున్న ఆందోళనల్లో న్యాయం ఉన్నదని, అందుకు ఏడాదిగా వారు తమ డిమాండ్లను ఉపసంహరించుకోవడం లేదన్నారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయిత్ బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో బేటీ అయ్యారు. వీరి సమావేశంలో కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో పాటు పలు అంశాలపై చర్చించారు.
“మేము వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించాం. మేము రైతులతో ఉన్నాం. వారి డిమాండ్లు నెరవేరే వరకు వారి ఉద్యమంతో ఉంటాం ” అని మమతా బెనర్జీ చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా పరిశ్రమలు ఇబ్బందులకు గురవుతున్నాయని, ఔషధాలపై జీఎస్టీ విధించి వేధిస్తున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. గత ఏడు నెలలుగా కేంద్రం రైతులతో మాట్లాడటానికి బాధపడటం లేదని, కేంద్రం వెంటనే తమ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని మమత డిమాండ్ చేశారు.
” రైతుల ఉద్యమానికి మమతా బెనర్జీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మాకు హామీ ఇచ్చారని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. ఈ హామీ ఇచ్చినందుకు మమతాజీకి ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఒక మోడల్ స్టేట్గా పనిచేయాలని, రైతులకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలి” అని విజ్ఞప్తి చేసినట్లు తికాయత్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్లో పర్యటించిన రాకేశ్ తికాయత్.. బీజేపీకి ఓటు వేయవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ టీఎంసీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు. మమత పోటీ చేసిన నందిగ్రామ్ లోనూ పర్యటించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు.
కొత్త రికార్డ్ : పది మందికి జన్మనిచ్చిన సౌతాఫ్రికా మహిళ
ఓపెన్ లెటర్ : స్కాలర్షిప్ కోసం బిర్సా కుటుంబీకుల వినతి
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
మంచి డిక్రీ : వ్యాక్సిన్ వేసుకోని వారికి గ్రామ బహిష్కరణ
సమష్ఠి విజయం : తొలి మాస్క్ రహిత దేశంగా ఇజ్రాయెల్
చరిత్రలో ఈరోజు.. గిరిజనుల ఆరాధ్యదైవం బిర్సా ముండా
ఆహారం విషం : ఇలా కూడా వ్యాధులు వస్తుంటాయి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..