న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్ 2020 కోసం ఇంటర్వ్యూ షెడ్యూల్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. ఇంటర్వ్యూలు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 22 వరకు నిర్వహించనున్నారు. ఇంతకుముందు ఈ ఇంటర్వ్యూలు ఏప్రిల్ 26 నుంచి జరగాల్సి ఉండగా, కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా పడ్డాయి. సివిల్ సర్వీసెస్ ప్రీ అండ్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ www.upsc.gov.in ద్వారా ఇంటర్వ్యూ షెడ్యూల్ను తనిఖీ చేసుకోవచ్చు.
యూపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ లెటర్ త్వరలో జారీ చేయనున్నారు. ఇంటర్వ్యూలు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి, రెండవ సెషన్ మధ్యాహ్నం 1 నుంచి ప్రారంభమవుతాయి. పర్సనాలిటీ టెస్ట్ లెటర్లో అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఏ సమయంలో హాజరు కావాలో వెల్లడిస్తారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2020 మెయిన్స్ పరీక్ష ఫలితం మార్చి 23 న విడుదలైంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ రౌండ్కు పిలుస్తారు.
35 ఏండ్ల క్రితం : లార్డ్స్లో తొలి టెస్ట్ విజయం చిరస్మరణీయం
ఇంద వంద : గడ్డం కాదు మోదీజీ, ఉపాధి పెంచండి..
మా పెళ్లి చెల్లదు : భర్త నుంచి విడిపోయిన ఎంపీ నుస్రత్
పెద్ద పొరపాటు : నోరు జారిన కేంద్ర మంత్రి గడ్కరీ
కొత్త రికార్డ్ : పది మందికి జన్మనిచ్చిన సౌతాఫ్రికా మహిళ
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..