పెషావర్ : పాకిస్తాన్లో ఉగ్రవాద ఆర్థిక నెట్వర్క్ బహిర్గతమైంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు అభయారణ్యంగా మారింది. ఇక్కడ తాలిబాన్, ఇతర ఉగ్రవాద సంస్థలకు మసీదుల ద్వారా పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తారు. ప్రజలతో పాటు పలు సంస్థలు మసీదులకు ఇలాంటి విషయాల్లో సహకరిస్తాయి. మసీదుల నుంచి ఉగ్రవాదులకు విరాళాలు అందించే పద్ధతి చాలా కాలంగా కొనసాగుతున్నది.
ఈ రహస్యాన్ని బహిర్గతపరిచిన పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీ.. ఉగ్రవాదులకు సహాయం చేయడాన్ని వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డాన్ వార్తాపత్రిక నివేదిక ప్రకారం, ప్రభుత్వ ఈ చర్యల కారణంగా పాకిస్తాన్ ఇబ్బందులను ఎదుర్కొంటుందని, ఉగ్రవాద సంస్థలకు నిధుల సేకరణ విషయంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్ నుండి బయటపడటం లేదని పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీ అవామి నేషనల్ పార్టీ (ఏఎన్పీ) స్పష్టం చేసింది. పాకిస్తాన్లో రక్తపాతం కోసం మసీదుల నుంచి అందుతున్న విరాళాలను ఆపాలని ఏఎన్పీ ప్రతినిధి అమల్ వలీ ఖాన్ ప్రభుత్వానికి సూచించారు.
ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాలు ఉపసంహరించుకోవడం ప్రారంభం అవడంతో పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు మళ్లీ చురుకుగా ఉన్నారని ఆయన అన్నారు. దీని తర్వాత కూడా ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాకిస్తాన్ ఇప్పుడు గత తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి అని, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అంతం చేయడానికి దాని ప్రాధాన్యతలను నిర్ణయించాలని చెప్పారు.
ఫొటోలో నిజాలు : కిమ్ ఆరోగ్యంపై మరోసారి ఊహాగానాలు..!
నియామకం : యూఎన్ ‘చెఫ్ డీ క్యాబినెట్’ గా నాగరాజ్ నాయుడు
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
డిజిటల్ పేమెంట్స్ : నాలుగేండ్లలో 1200 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీలు
సివిల్స్ 2020 : ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
35 ఏండ్ల క్రితం : లార్డ్స్లో తొలి టెస్ట్ విజయం చిరస్మరణీయం
ఇంద వంద : గడ్డం కాదు మోదీజీ, ఉపాధి పెంచండి..
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..