Brij Bhushan | భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (Wrestling Federation of India, WFI)కు చీఫ్గా బ్రిజ్ భూషణ్ పనిచేశారు. 2023, ఏప్రిల్లో ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. ఏప్రిల్ 28న అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అతడిపై రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి లైంగిక వేధింపులు, పరువుకు భంగం కలిగించడం, వెంటపడటంపై ఫిర్యాదు కాగా. రెండోది మైనర్ రెజ్లర్ ఫిర్యాదు ద్వారా పోక్సో కేసు నమోదయ్యాయి. దీంతో అతడితో పాటు డబ్ల్యూఎఫ్ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది.
32 మంది సాక్షుల వివరణ, నిందితుల వాంగ్యూలాలపై విచారణ చేపట్టింది కోర్టు. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అడిషనల్ చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ (ACJM) అశ్విని పన్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025లో మైనర్ ఫిర్యాదుదారకు సంబంధించిన పోక్సో కేసులో ఢిల్లీ పోలీసులు సమర్పించిన ‘క్లోజర్ రిపోర్ట్ (కేసును మూసివేసే నివేదిక)ను’ కూడా కోర్టు ఆమోదించింది. భారత క్రీడా రంగంలో అత్యంత ప్రముఖమైన కేసుల్లో ఒకటి అయిన ఈ కేసుకు ముగింపు పలికారు.