న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. విద్యార్థుల బృందం లైబ్రరీని ధ్వంసం చేయడంతోపాటు ఉద్యోగులపై కూడా దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆందోళనాకారులపై జేఎన్యూ అదికారులు కేసు నమోదు చేశారు. జేఎన్యూ అడ్మినిస్ట్రేషన్ గత కొన్ని రోజులుగా లైబ్రరీని మూసి ఉంచింది. అయితే, మూకుమ్మడిగా వచ్చిన విద్యార్థుల బృందం లైబ్రరీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డొచ్చిన ఉద్యోగులపై చేయి చేస్తున్నారు. అనంతరం లైబ్రరీలో పుస్తకాలను ఎత్తుకెళ్లారని విశ్వవిద్యాలయం అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు విద్యార్థులను ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
యూనివర్శిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీ ఆర్ అంబేద్కర్ లైబ్రరీ పక్కన ఉన్న గాజు తలుపు పగలగొట్టారు. ప్రధాన గ్రంథాలయంలోకి ప్రవేశించి అక్కడే ఉండిపోయారు. రాత్రిపూట కూడా లైబ్రరీ భవనాన్ని ఖాళీ చేయలేదు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలను కూడా పాటించడం లేదని అధికారులు తెలిపారు. చాలా కాలంగా లైబ్రరీ తెరవకపోవడం పీహెచ్డీ స్కాలర్లను నిరాశపరిచిందని ఒక విద్యార్థి చెప్పారు. విద్యార్థులు లైబ్రరీలోకి ప్రవేశించినప్పటికీ ఎలాంటి హింసకు పాల్పడలేదని ఆయన తెలిపారు. గతంలో కూడా యూనివర్శిటీలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పలువురిపై కేసులు కూడా నమోదై అరెస్టులు జరిగాయి. ఆధిపత్యం చలాయించడం కోసం ఇలా విద్యార్థి సంఘాలు ఆందోళనకు పురికొల్పుతాయని అక్కడి ఉద్యోగులు అంటున్నారు.
డిబేట్ ఇలాగేనా : టీవీ చర్చలో ఎంపీని కొట్టిన ఇమ్రాన్ మాజీ సలహాదారు
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
ఇక నిశ్చింత : కరోనా రోగుల సేవలో గ్రేస్ రోబోట్
ఆర్థిక సాయం : తాలిబాన్ కోసం పాకిస్తాన్ మసీదుల్లో విరాళాల సేకరణ
ఫొటోలో నిజాలు : కిమ్ ఆరోగ్యంపై మరోసారి ఊహాగానాలు..!
నియామకం : యూఎన్ ‘చెఫ్ డీ క్యాబినెట్’ గా నాగరాజ్ నాయుడు
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
డిజిటల్ పేమెంట్స్ : నాలుగేండ్లలో 1200 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీలు
సివిల్స్ 2020 : ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
35 ఏండ్ల క్రితం : లార్డ్స్లో తొలి టెస్ట్ విజయం చిరస్మరణీయం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..