వాషింగ్టన్: రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశానికి చెందిన పది మంది దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంతోపాటు సైబర్ దాడి, ఇతర శత్రు కార్యకలాపాల కారణంగా గురువారం రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది.
రష్యా ప్రభుత్వ రుణాలలో అమెరికా బ్యాంకుల వ్యాపారంపై ఆంక్షలను విస్తరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. రష్యాకు చెందిన గూఢచారులతో పాటు 10 మంది దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది వ్యక్తులను కూడా పంపించనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.
జో బైడెన్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం “రష్యా తన అస్థిర అంతర్జాతీయ చర్యలను కొనసాగిస్తే లేదా పెంచుకుంటే అమెరికా వ్యూహాత్మక, ఆర్ధికంగా ప్రభావవంతమైన రీతిలో ఖర్చులు విధిస్తుందని చెప్పడానికి ఒక సంకేతాన్ని పంపుతున్నది” అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా అసమ్మతివాదులు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు అమెరికా జాతీయ భద్రతకు ముఖ్యమైన దేశాల్లో భద్రతను అణగదొక్కుతున్నారని కూడా ప్రకటనలో పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి సహాయపడటానికి రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 2016, 2020 అధ్యక్ష ఎన్నికల్లో నిరంతర సమాచారం, చెడు ఉపాయాల ప్రచారానికి పాల్పడ్డాయనే ఆరోపణలను వైట్ హౌస్ ప్రకటన సూచిస్తుంది.
అమెరికా పార్లమెంట్లో అంబేడ్కర్కు నివాళులు
పాకిస్తాన్లో ఆందోళనలు.. ఏడుగురు మృతి
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
టీకా ఆఫర్ : రిబెట్ ఇస్తున్న దుబాయ్ హోటల్స్
సముద్రంలో వందలాది పడవల మోహరింపు.. పరిస్థితిని సమీక్షిస్తున్న పీఎల్ఏ
కచ్ వద్ద పాకిస్తానీయుల పట్టివేత.. 150 కోట్ల హెరాయిన్ స్వాధీనం
66 ఏండ్ల క్రితం ప్రారంభమైన మెక్డోనాల్డ్.. చరిత్రలో ఈరోజు
భారత్లో బోరిస్ జాన్సన్ పర్యటన కుదింపు
చంద్రుడిపై రోవర్ను పంపేందుకు జపాన్తో జతకట్టిన అరబ్ ఎమిరేట్స్
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..