దుబాయ్ : చంద్రుడిపై రోవర్ను పంపేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జపాన్తో జతకట్టింది. 2022 లో జపాన్కు చెందిన చంద్ర అన్వేషణ సంస్థ ఐస్పేస్ తో కలిసి రోవర్ను చంద్రుడిపైకి పంపనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బుధవారం తెలిపింది.
యూఏఈ తన ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరిచేందుకు అంతరిక్ష పరిశోధన వ్యాపారంలో వేగంగా విస్తరించాలని ప్రణాళికగా పెట్టుకున్నది. యూఏఈ తన శాస్త్రీయ, సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి, భవిష్యత్లో చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి తన అంతరిక్ష కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నది. అరబ్ ప్రపంచంలోని మొట్టమొదటి గ్రహాంతర పరిశోధన ఫిబ్రవరిలో అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. అది ఇప్పుడు మార్టిన్ వాతావరణం డాటాను పంపుతున్నది.
రషీద్ లూనార్ రోవర్ను పూర్తిగా ఎమిరాటిస్ డిజైన్ చేస్తుంది. యూఏఈ మొదట దీనిని 2024 నాటికి అంతరిక్షంలోకి పంపాలని భావించింది. 2010 లో స్థాపించిన జపనీస్ కంపెనీ ఐస్పేస్, చంద్రుడిపైకి వాణిజ్య రవాణాను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 2022 ప్రయోగం ఐస్పేస్ ఈ రకమైన మొదటి మిషన్ అవుతుంది. ఫ్లోరిడా నుంచి ప్రయోగించటానికి ఎలోన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ను ఉపయోగించనున్నది.
దుబాయ్కు చెందిన మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (ఎంబీఆర్ఎస్సీ) రషీద్ లూనార్ రోవర్ను నిర్మించనున్నది. డాటా సేకరణ పూర్తయిన తర్వాత ఇది చంద్రుడిపైకి ప్రయోగిస్తారని ఎమిరేట్స్ లూనార్ మిషన్ మేనేజర్ హమద్ అల్ మార్జూకి తెలిపారు.
స్పేస్ఎక్స్ రాకెట్ చంద్రుని కక్ష్యకు ఐస్పేస్ ల్యాండర్ను అందిస్తుంది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపైకి దూసుకుపోతుంది. యూఏఈ రోవర్ ల్యాండర్ నుంచి విడివడి అక్కడి వాతావరణం, వనరుల గురించి అన్వేషించడానికి బయలుదేరుతుందని ఐస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ తకేషి హకమాడ తెలిపారు.
స్థానిక నైపుణ్యాన్ని పెంపొందించడానికి యూఏఈ 2017 లో జాతీయ అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. యూఏఈ జనాభా 9.4 మిలియన్లు, కాగా వీరిలో ఎక్కువ మంది విదేశీ కార్మికులే ఉన్నారు. అంతరిక్ష కార్యక్రమాలు కలిగిన ప్రధాన దేశాల శాస్త్రీయ, పారిశ్రామిక స్థావరం ఇప్పటివరకు ఎమిరేట్స్కు లేదు.
హజ్జా అల్-మన్సౌరీ 2019 లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడంతో అంతరిక్షంలో మొదటి ఎమిరాటి అయ్యాడు. ఈ వారం వ్యోమగామిగా శిక్షణ పొందిన మొదటి అరబ్ మహిళను యూఏఈ ఎంపిక చేసింది.
ఎవర్ గివెన్ను స్వాధీనం చేసుకోండి : ఈజిప్ట్ కోర్టు
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
సొంత ప్రజలపైనే కెమికల్ అటాక్.. సిరియా దుర్మార్గాన్ని బయటపెట్టిన నివేదిక
కుట్టుపిండి ఆహారాలు తిన్న 500 మందికి అస్వస్థత
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ దేశ్ముఖ్
మహా దార్శనికుడు భీంరావ్ అంబేడ్కర్ : చరిత్రలో ఈరోజు
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..