ముంబై : సీబీఐ విచారణకు మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ బుధవారం హాజరయ్యారు. ముంబైలోని కలినీ వద్ద ఉన్న డీఆర్డీఓ, ఎయిర్ ఫోర్స్ గెస్ట్హౌస్లో విచారణ కొనసాగుతున్నది.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ అభియోగాలు మోపడంతో సీబీఐ విచారణకు ముంబై హైకోర్టు ఆదేశించింది. ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ జరుపుతున్న సీబీఐ 15 రోజుల్లో తమ నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు.
రూ.100 కోట్ల రికవరీ కేసులో ముంబై పోలీసు మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్.. హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ పై చేసిన తీవ్రమైన ఆరోపణలపై సీబీఐ రెండు రోజుల క్రితం అనిల్ దేశ్ ముఖ్ అనుచరులైన సంజీవ్ పరాండే, కుందన్ షిండేలను కూడా విచారించారు. ఈ సమయంలో సిబిఐకి చాలా ముఖ్యమైన సమాచారం లభించినట్లు తెలిసింది. ఆ తర్వాతే దేశ్ముఖ్ను ప్రశ్నించడానికి పిలవాలని నిర్ణయించారు.
ముంబై పోలీసుకలు అరెస్టు చేసిన పోలీసు అధికారి సచిన్ వాజ్కు ప్రతి నెలా రూ.100 కోట్లు రికవరీ చేయాలన్న లక్ష్యాన్ని అనిల్ దేశ్ముఖ్ ఇచ్చారని పరంబీర్ సింగ్ ఆరోపించారు. ఇవాళ దేశ్ముఖ్ను ప్రశ్నించిన తర్వాత, దేశ్ముఖ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా? వద్దా? అని నిర్ణయించనున్నారు.
ముంబై హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా అనిల్ దేశ్ముఖ్, మహారాష్ట్ర ప్రభుత్వం రెండూ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశాయి. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి నిరాకరించింది.
మహా దార్శనికుడు భీంరావ్ అంబేడ్కర్ : చరిత్రలో ఈరోజు
భారతీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అమెరికన్ సింగర్
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయకండి..!
టిబెట్ సరిహద్దుల్లో 5 జీ నెట్వర్క్ విస్తరిస్తున్న చైనా
రెండేండ్లలో పెరిగిన బంగారం దిగుమతి
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..