దీన జన బాంధవుడు, మహా దార్శనికుడు, భారత రాజ్యంగ రచయిత డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్.. మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో మందన్గాడ్ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామంలో మెహర్ కులానికి చెందిన రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయి దంపతుల 14వ సంతానంగా 1891 ఏప్రిల్ 14న జన్మించారు. బాల భీంరావ్ ప్రతిదినం రామాయణ, భారత, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలు గానం చేసేవారు.
దళిత కుటుంబంలో జన్మించిన అంబేడ్కర్ చిన్నతనం నుంచే వివక్షను ఎదుర్కొన్నారు. అంబేద్కర్ పాఠశాలలో చివరి వరుసలో కూర్చోవలసి వచ్చింది. చిన్నప్పటి నుంచీ చదువులో మంచిగా ఉన్న అంబేడ్కర్ ముంబైలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొదటి దళిత విద్యార్థి.
బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల వేతనంతో 1912లో బీఏ పరీక్షల్లో నెగ్గారు. అనంతరం బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పైచదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరకుండా తన కోరికను మహారాజుకు తెలిపారు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేండ్లు పనిచేసే షరతు మేరకు 1913లో రాజాగారి ఆర్థికసాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయం చేరారు.
1915లో ఎంఏ, 1916లో పీహెచ్డీ డిగ్రీలను అందుకున్నా. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేండ్ల తర్వాత “ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా” పేరుతో ప్రచురితమైంది.
1927లో అంబేద్కర్ ‘బహిష్కృత భారతి’ అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించారు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నారు.. తిలక్ గనుక అంటరానివాడుగ పుట్టివుంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’అని అనకుండా.. ‘ అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు’ అని ప్రకటించి ఉండేవారని వ్రాశారు.
రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య 1935లో మరణించింది.
కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబర్లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 అక్టోబర్ 14న నాగ్ పూర్ లో అంబేడ్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. అంబేడ్కర్ పలు గ్రంథాలు రచించారు. ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ’, ‘ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా’, ‘ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్’, ‘ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ’ ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు.
సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ 1956 డిసెంబర్ 6 న కన్నుమూశారు.
2014: నైజీరియాలోని చిబోక్లోని బోర్డింగ్ పాఠశాల నుంచి 275 మంది బాలికలను కిడ్నాప్ చేసిన ఇస్లామిక్ సంస్థ బోకో హరామ్
2010: చైనాలోని కిగాగైలో సంభవించిన 6.9 భూకంపంలో దాదాపు 2700 మంది దుర్మరణం
2010: పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ మరియు ఒడిశాలో తుఫాను తుఫాను 123 మంది మృతి
2008 : కోల్కతా నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తొలి రైలు ప్రయాణం ప్రారంభం
2006: చైనాలో మొదటి బౌద్ధ ప్రపంచ సమావేశం ప్రారంభం
1995: ఆసియా కప్లో శ్రీలంకను ఓడించి నాలుగోసారి ఛాంపియన్గా నిలిచిన భారత్
1988: జెనీవాలో యుఎస్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లతో ఒప్పందం కుదుర్చుకున్న సోవియట్ యూనియన్
1963: హిందీ హిందీ సాహిత్యవేత్త రాహుల్ సంకృత్యయన్ మరణం
1962 : విశ్వకర్మ ఆఫ్ మాడ్రన్ ఇండియా బిరుదాంకితుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరణం
1944: బాంబే పోర్ట్ (పోర్ట్) వద్ద మందుగుండు సామగ్రితో నిండిన ఓడ పేలి 800 మందికి పైగా దుర్మరణం
1922: ప్రసిద్ధ భారతీయ సంగీత స్వరకర్త, శాస్త్రీయ గాయకుడు, సరోద్ మాస్ట్రో అలీ అక్బర్ ఖాన్ జననం
1919: హిందీ చిత్రాల ప్రసిద్ధ గాయకుడు షంషాద్ బేగం జననం
భారతీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అమెరికన్ సింగర్
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయకండి..!
టిబెట్ సరిహద్దుల్లో 5 జీ నెట్వర్క్ విస్తరిస్తున్న చైనా
రెండేండ్లలో పెరిగిన బంగారం దిగుమతి
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..