న్యూఢిల్లీ : ఇండో-భూటాన్ సరిహద్దులో టిబెట్ సరిహద్దుకు సమీపంలో ప్రపంచంలోనే ఎత్తైన రాడార్ సైట్ వద్ద 5 జీ సిగ్నల్ బేస్ను చైనా ప్రారంభించింది. ఇక్కడి గున్బాలా రాడార్ స్టేషన్లో చైనా ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది. ఈ వార్త భారతదేశానికి ముఖ్యమైనది. ఎందుకంటే గున్బాలా రాడార్ స్టేషన్ భారతదేశం-భూటాన్ సరిహద్దుకు ఆనుకొని ఉంటుంది. ఈ పర్వతం టిబెట్లోని నాగర్జ్ కౌంటీలో ఉన్నది.
చైనా సైన్యానికి చెందిన అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఈ టవర్ ఎత్తు సముద్ర మట్టానికి 5,374 మీటర్లు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రాడార్ స్టేషన్. తన సైనికులకు 5 జీ సేవలను అందించడానికి గత ఏడాది గున్బాలాలోని ప్రైవేటు రంగ సహకారంతో ఈ స్టేషన్ పనులను ప్రారంభించినట్లు చైనా సైన్యం తెలిపింది.
ఈ సేవ ప్రారంభమైన తరువాత, సైనికులు సమాజంతో మరింత ఎక్కువగా అనుసంధానంగా ఉండగలుగుతారని, సరిహద్దులో మోహరించిన సైనికుల శిక్షణను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు చైనా సైన్యం వెబ్సైట్లో పొందుపరిచారు.
చైనా ప్రపంచంలోనే ఎత్తైన టిబెట్లోని మారుమూల హిమాలయ ప్రాంతంలో బేస్ స్టేషన్ను గత ఏడాది ప్రారంభించింది. ఈ బేస్ స్టేషన్ 6,500 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. ఈ సౌకర్యం పర్వతారోహణ, శాస్త్రీయ పరిశోధన, పర్యావరణ పర్యవేక్షణ, హై-డెఫినిషన్ స్ట్రీమింగ్కు సహాయపడుతుందని చైనా తెలిపింది.
రెండేండ్లలో పెరిగిన బంగారం దిగుమతి
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
మధ్యప్రదేశ్లో ఆక్సిజన్ కొరత.. ఒకేరోజు నలుగురు మృతి
జలియన్ వాలా బాగ్ మారణకాండ.. బ్రిటిషర్ల దురాగతానికి 102 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చర్యల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..