పెషావర్ : ఈ ఏడాది మార్చి 13 న జరిగిన షోపియన్ ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు అమెరికా ఎం-4 కార్బైన్ ఉన్నాయి. కార్బైన్ పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్లో తయారు చేసినట్లు గుర్తించామలని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు.
అక్రమ ఆయుధ కర్మాగారం, అక్రమ రవాణాకు ప్రపంచవ్యాప్తంగా పెషావర్ పాస్ అడెంఖేల్ ప్రసిద్ధి. ఇక్కడ అసలీ గన్నులతోపాటు వివిధ దేశాల కాపీ తుపాకులు కూడా దొరుకుతాయి. వివిధ దేశాల్లో లక్షల్లో దొరికే తుపాకులు ఇక్కడ వేలల్లోనే అందుబాటులోకి వస్తున్నాయి.
ఇక్కడ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్, మోర్టార్, రాకెట్ లాంచర్, ఎకె -47 వరకు ఏ ఆయుధమైనా దొరుకుతుంది. అది కూడా చాలా తక్కువ ధరకు దొరకడం ఈ మార్కెట్ స్పెషాలిటీ. పెషావర్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం పేరు దర్రా అడెంఖేల్. ఇక్కడ బుల్లెట్ల ధ్వనులు చాలా సాధారణం. కొండ మధ్యలో లక్ష జనాభా ఉన్న ఈ పట్టణంలో అక్రమ ఆయుధాల తయారీకి దాదాపు 100 కర్మాగారాలు ఉన్నాయి.
పిస్టల్స్, యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, ఎల్ఎమ్జీలు, మెషిన్ గన్స్, మోర్టార్స్, షాట్గన్ల నుంచి అమెరికన్ ఎం-4 కార్బైన్ వరకు.. రష్యన్ కలాష్నికోవ్ (ఏకే-47) రైఫిల్స్, గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రి అందుబాటులో ఉంటుంది.
కొనుగోలుదారులు తుపాకీలు పేల్చి పనిచేస్తున్నవి లేవని పరీక్షించుకుని మరీ కొనుగోలు చేస్తుంటారు. అందుకే ఈ పట్టణంలో రోజంతా బుల్లెట్ల రణగొణ ధ్వనులు వినిపిస్తుంటాయి. పాస్ ఆడమ్ఖేల్లో సుమారు 2000 దుకాణాలు ఉన్నాయి. వాటిలో 1800 కన్నా ఎక్కువ ఆయుధాలు అమ్మకానికి ఉన్నాయి.
రూ.5-6 లక్షలతో 30-35 వేల విదేశీ తుపాకుల కోసం నిర్మించిన కర్మాగారంలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఖాన్.. డజన్ల కొద్దీ ఏకే-47 లను తయారు చేశాడు. రూ.30-35 వేలకు రూ.5-6 లక్షల విలువచేసే విదేశీ తుపాకులను తయారు చేస్తున్నామని ఆయుధాల వ్యాపారి హాజీ షా గుల్ చెప్పారు.
ఇక్కడి చేతి వృత్తులవారు అమెరికా, జర్మనీ, టర్కీ, చైనా, రష్యా దేశాలకు చెందిన ఆయుధాలకు నకిలీలను తయారుచేస్తుంటారు. అయితే, కొంతకాలంగా ప్రభుత్వ ఆంక్షల కారణంగా మార్కెట్ కుంచించుకుపోయిందని ఆయన చెప్పారు.
పాకిస్తాన్లో అత్యంత అక్రమ ఆయుధాలను తయారు చేస్తున్న ఫ్యాక్టరీ యజమాని షా సౌద్. తన కుటుంబం 50 సంవత్సరాలుగా ఈ పనిలో ఉన్నదని షా సౌద్ చెప్పారు. ఇంతకు ముందు ఈ ఆయుధ వ్యాపారం హుజ్రా (గెస్ట్ హౌస్) గా ఉండేది. తరువాత మొత్తం మార్కెట్గా మారిపోయింది.
పాస్ అడెంఖేల్ను అటానమస్ ట్రైబల్ ఏరియా నుంచి ఉపసంహరించుకోవడంతో ఇక్కడ చాలా ఆంక్షలు విధించినట్లు సౌద్ తెలిపారు. ఇప్పటికీ పాకిస్తాన్లో అత్యంత అక్రమ ఆయుధ వ్యాపారం ఇక్కడ తయారు చేయబడినప్పటికీ.. ఇక్కడ 90 శాతం ఉపాధి ఆయుధ వ్యాపారంలోను ఉండటం విశేషం.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో విపరీతమైన పెరుగుదల ఉన్నది. 2020 లో 475 ఆయుధాలను స్వాధీనం చేసుకోగా, 2019 లో ఈ సంఖ్య సగంగా ఉన్నది. ఈ ఆయుధాల్లో ఎం-4 కార్బైన్తో పాటు అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి.
భద్రతా దళాల అప్రమత్తత, ఉగ్రవాదులపై కొనసాగుతున్న చర్యల కారణంగా సరిహద్దు నుంచి ఆయుధాల అక్రమ రవాణా పెరిగింది. ఇటీవల, భారత-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పంజాబ్ అమృత్సర్ సమీపంలో విదేశీ ఆయుధాలు లభించాయి. ఏకే-56, మ్యాగజైన్ 5 లైవ్ కార్ట్రిడ్జ్, ఏకే-47, పాయింట్ 303 గన్, పాయింట్ 30 చైనీస్ పిస్టల్ ఇక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఇక్కడ తయారై సరిహద్దులు దాటుతున్నాయని భద్రతా దళాలు పేర్కొంటున్నాయి.
బడుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్రలో ఈ రోజు
డైనోసార్ల కలిసి తిరిగిన ఉడుమును కనుగొన్న శాస్త్రవేత్తలు
కొవిడ్తో నటుడు సతీష్ కౌల్ కన్నుమూత
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరిన ముగ్గురు వ్యోమగాములు
గిన్నిస్ రికార్డు గోర్లు.. 30 ఏండ్ల తర్వాత కత్తిరింపు
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..