ముంబై : మార్చిలో గత రెండేండ్లలో మన దేశం అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకున్నది. గత నెలలో 98.6 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా.. మార్చి నెలలో 13 టన్నులతో పోలిస్తే 8 రెట్లు ఎక్కువగా ఉన్నది. ఇది 2019 మే తరువాత అత్యధిక దిగుమతి అని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
బ్లూమ్బెర్గ్ డాటా ప్రకారం, మార్చి త్రైమాసికంలో దేశంలో దిగుమతులు గత సంవత్సరం నుంచి 190 టన్నులకు రెట్టింపు అయ్యింది. మార్చి 2021 లో రూ.63 వేల కోట్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది. 2020 మార్చితో పోల్చితే రూ. 9 వేల కోట్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారు దిగుమతిదారుగా భారతదేశం నిలిచింది. బంగారు దిగుమతుల పెరుగుదల వల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3 త్రైమాసికాలలో దిగుమతులు తగ్గడం వల్ల కరెంట్ ఖాతా మిగులులో ఉన్నది. అయితే, దిగుమతుల పెరుగుదల కారణంగా అది మళ్ళీ లోటులోకి చేరవచ్చని నిపునులు భావిస్తున్నారు.
2020 ఆగస్టు నుంచి బంగారం ధరలు 17 శాతం కంటే ఎక్కువ తగ్గాయి. వివాహాల సీజన్ కాకుండా అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో తగ్గిన ధరలకు డిమాండ్ పెరిగింది. అలాగే, ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుండి 7.5 శాతానికు తగ్గించడం వల్ల బంగారం దిగుమతులు పెరిగినట్లుగా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
మధ్యప్రదేశ్లో ఆక్సిజన్ కొరత.. ఒకేరోజు నలుగురు మృతి
జలియన్ వాలా బాగ్ మారణకాండ.. బ్రిటిషర్ల దురాగతానికి 102 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చర్యల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..