హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ హైదరాబాద్ బ్లాక్హాక్స్.. గోవా గార్డియన్స్ అండర్-21 ట్రోఫీలో శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో హైదరాబాద్ 15-8, 15-13, 16-14తో బెంగళూరుపై నెగ్గింది. ఈ టోర్నీలో బ్లాక్ హాక్స్ సహా పీవీఎల్లోని పది జట్లు పోటీ పడుతున్నాయి.
కాగా, బ్లాక్హాక్స్ ఫ్రాంచైజీ ఇటీవల విజయవాడలో నిర్వహించిన అండర్-21 ట్రయల్స్లో ప్రతిభావంతులైన తెలుగు క్రీడాకారులను గుర్తించింది. ట్రయల్స్లో ప్రతిభ చూపిన 12 మందిని తమ అండర్-21 జట్టుకు ఎంపిక చేయగా.. ఇందులో నలుగురు తెలుగు ప్లేయర్లు ఉన్నారు. పెద్దపల్లికి చెందిన స్రునిక్, వరంగల్ కుర్రాడు అక్షిత్తో పాటు కార్తీక్ (గుంటూరు), ధీమన్ (వైజాగ్) సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ నలుగురూ గార్డియన్స్ ట్రోఫీలో బ్లాక్హాక్స్కు ఆడుతున్నారు.