ఎల్లారెడ్డిపేట, జూలై 2: యూరియా కోసం రైతులు పడరాని పాట్లుపడుతున్నారు. యాప్ ఓపెన్ కాకపోవడంతో రై తులు వ్యవసాయాధికారి కార్యాలయాని కి పరుగెత్తుతున్నారు. కొత్త అప్డేట్ వర్షన్ యాప్లో బుక్ చేసుకోవాలని రెండు రో జుల క్రితం సోషల్ మీడియాలో వ్యవసాయాధికారులు సమాచారం పెట్టారు. కొ త్తగా అప్డే ట్ చేసుకున్నప్పటికీ యూరి యా బుక్ కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో నిమ్మల బాబు అనే రైతు తనతోపాటు మరో ఇద్దరు రైతుల ఫోన్లు తీసుకుని గురువారం ఉదయం 5.30 నుంచే యాప్లో బుక్ చేసేందుకు ముప్పు తిప్పలు పడ్డాడు.