న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతుండటంతో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ప్రజలను వివిధ దేశాల ప్రభుత్వాలు చైతన్యం చేస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మరింత ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు రాగా.. దుబాయ్లోని మూడు పెద్ద రెస్టారెంట్లు రిబెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కొన్ని సంస్థలు రెండు రోజుల సెలవులు ఇవ్వడానికి కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చాయి.
కొరెనావైరస్లను నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా మాస్కులతోపాటు టీకాలు తీసుకోవడం తప్పనిసరి చేశారు. భారత్తో పాటు పలు దేశాల్లో టీకా తీసుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చేందుకు వారికి ఉత్కంఠభరితమైన ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి అదనంగా 5 శాతం పన్ను మినహాయింపు ఇస్తుండగా, రష్యాలో ఉచిత ఐస్ క్రీం, ఇజ్రాయెల్లో కేక్ డబ్బాలు, పిజ్జా-పేస్ట్రీలను అందిస్తున్నారు. అమెరికాలో ఉచిత వీడియో గేమ్స్, కిరాణా సామాగ్రికి భారీ డిస్కౌంట్తో అనేక వస్తువులను ఉచితంగా ఇస్తున్నారు.
చాలా కంపెనీలు, కరోనా సెకండ్ వేవ్ను మునుపటి కంటే చాలా ప్రమాదకరమైనవిగా భావించి, తమ ఉద్యోగులకు 250 డాలర్ల బోనస్ ప్రకటించాయి. మరికొన్ని సంస్థలు రెండు రోజుల సెలవు ప్రకటించాయి. టీకాలు తీసుకోవాలని ప్రజలను ఉత్సాహపరిచేందుకు ప్రసిద్ధ వంటకం ‘జ్యోజా’ ఇవ్వడం గురించి కూడా ఆలోచించవచ్చని జపాన్లో కరోనా వ్యాక్సిన్ ఇంచార్జీ మంత్రి టారో కోనో చెప్పారు.
దుబాయ్లోని మూడు ప్రధాన రెస్టారెంట్లు మొదటి మోతాదు వ్యాక్సిన్ తీసుకున్నవారికి 90 శాతం, రెండవ మోతాదుకు 80 శాతం తగ్గింపును ఇస్తున్నాయి. మెక్సికోలోని వ్యాక్సిన్ సెంటర్ను సందర్శించే వారికి వారికిష్టమైన అభిమాన బ్యాండ్ ట్యూన్ పాడుతూ వారిని ఆనంద డోలికల్లో ముంచెత్తుతున్నారు.
అమెరికాలో కూడా చాలా ఆఫర్లు అందిస్తున్నారు. ఇక్కడ మెక్డొనాల్డ్స్, ఏటీ అండ్ టీ, ఇన్సాకార్ట్, ట్రేడర్ జోస్, కోబాని వంటి అనేక సంస్థలు ఉద్యోగులకు సెలవు, నగదు ఇస్తామని ప్రకటించాయి. ఇది కాకుండా, టీకా కేంద్రాలకు రాకపోకలు సాగించడానికి ఉద్యోగులు 30 డాలర్లు అంటే దాదాపు రూ.2,200 చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. మిచిగాన్లో టీకా పెద్దలకు ప్రీ-రోల్డ్ గంజాయి అందిస్తున్నారు.
గుజరాత్లోని మోర్బి జిల్లాలో స్వర్ణకార్ సమాజ్ తన సమాజం వారి కోసం ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకున్నది. సమాజంలోని 1331 మంది మహిళలకు వ్యాక్సిన్ ఇచ్చి హ్యాండ్ బ్లాండర్స్ కానుకగా అందించారు. ఇందుకోసం దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేశారంట.
చైనాలో కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రారంభమయ్యాయి. బీజింగ్లోని పలు కేంద్రాల్లోని ప్రజలకు ఐస్ క్రీం ఇవ్వగా, 60 ఏండ్లకు పైబడిన వారికి ఒక పెట్టె గుడ్లు, రెండో డోసు తీసుకుంటే రెండు గుడ్ల పెట్టెలను ఇస్తున్నారు.
సముద్రంలో వందలాది పడవల మోహరింపు.. పరిస్థితిని సమీక్షిస్తున్న పీఎల్ఏ
కచ్ వద్ద పాకిస్తానీయుల పట్టివేత.. 150 కోట్ల హెరాయిన్ స్వాధీనం
66 ఏండ్ల క్రితం ప్రారంభమైన మెక్డోనాల్డ్.. చరిత్రలో ఈరోజు
భారత్లో బోరిస్ జాన్సన్ పర్యటన కుదింపు
చంద్రుడిపై రోవర్ను పంపేందుకు జపాన్తో జతకట్టిన అరబ్ ఎమిరేట్స్
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..