అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గైరైన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఆయన స్టైల్, యాష, బాష, మాట్లాడే తీరు, కనిపించే విధానం, ఆకట్టుకునే విధానం అన్నీ కూడా అందరినీ కట్టిపడేస్తుంటాయి. అతి తక్కువ సమయంలోనే అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా తన అభిమాని మృతి చెందాడనే విషయం తెలుసుకొని ఎమోషనల్ అయ్యారు.
అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న హేమంత్ అనే అభిమానితో వీడియో కాల్లో మాట్లాడి అతనిని సంతోషపరిచారు విజయ్ దేవరకొండ. అంతేకాదు అతనికి కొన్ని టీ షర్ట్స్, గిఫ్ట్స్ కూడా పంపాడు. ఇవి చూసి అతను ఫుల్ ఖుష్ అయ్యాడు . ఇక రీసెంట్గా హేమంత్ కన్నుమూయడంతో విజయ్ తన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ పెట్టారు. నిజంగా నిన్ను మిస్ అవుతున్నాను హేమంత్. మనం మట్లాడుకున్నందుకు సంతోషంగా ఉంది. నీ స్వచ్ఛమైన నవ్వ్వు చూసే ఛాన్స్ నాకు దక్కింది. నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ దేవుడిని నీ గురించి ప్రార్ధిస్తున్నాను. నిన్న నిజంగా మిస్ అవుతున్నాం హేమంత్. నీతో మాట్లాడిన ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని ఎమోషనల్ అయ్యారు విజయ్ దేవరకొండ.