గద్వాల, మే 8 : ప్రజలు కాంగ్రెస్, బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి ఆ ర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా గద్వాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో బుధవారం ఇంటింటి ప్ర చారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చే యూతనిచ్చారన్నారు. రాష్ట్రంలో ఆంజనేయస్వామి ఆలయం లేని ఊరు లేదు.. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని స్పష్టం చేశారు. గద్వాల అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమైందని చెప్పారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలకు నమ్మకం సన్నగిల్లడంతో సీఎం రేవంత్ దేవుళ్లపై ఒట్టు పెట్టి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. జాతీయ పార్టీలు ఎన్ని డ్రామాలాడినా ప్రజలు నమ్మరని, వారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్పీని గెలిపించాలని కోరారు. అనంతరం పార్టీ కార్యాలయంలో 15వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఫారూక్తోపాటు 50 మంది కార్యకర్తలు కారెక్కగా.. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ప్రతాప్గౌడ్, వైస్చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, మురళి, నాయకులు కృష్ణారెడ్డి, మోబిన్, గోవిందు, సాయిశ్యాంరెడ్డి, ధర్మానాయుడు, వంశీ, కురుమన్న, సవారన్న, చంద్రన్న, ఆంజనేయులు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.