Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరాడు. చిరుతో పాటు ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఇంతా సడన్గా చిరు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నాడు అనుకుంటున్నారా.? విషయం ఉందండి. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డ్ పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం. అయితే ఇప్పటికే రాష్ట్రపతి దౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ఎంపికైన వారికి అందజేస్తుండగా.. మే 09న చిరంజీవికి పద్మ విభూషణ్ అందజేయనున్నారు. ఇక ఈ అవార్డు అందుకోవడానికి తన ఫ్యామిలీతో సాయంత్రం ఢిల్లీ పయనమయ్యారు చిరు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
Megastar @KChiruTweets is on his way to Delhi to receive the prestigious Padma Vibhushan award tomorrow at Rashtrapati Bhavan✨#PadmaVibhushanChiranjeevi #Chiranjeevi #PadmaVibhushanMegaStarChiranjeevi pic.twitter.com/Olz9NhUk2G
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 8, 2024
సినిమాల విషయానికి వస్తే.. చిరు ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.