కల్వకురి/అచ్చంపేట/గద్వాల, మే 8 : ‘కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ గారడీలేనని, పరిపాలన అంటే పాన్డ బ్బా నడపడం కాదు.. ముందుచూపుతో ఆలోచిస్తూ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, ఇచ్చిన హామీలను అమ లు చేస్తూ, అభివృద్ధిలో రాష్టాన్ని ముందుకు తీసుకెళ్లడ మే పాలన దక్షత.. ఇది కేసీఆర్కు పుష్కలంగా ఉంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ తులసీవనం లాంటిదని.. అందులో కాంగ్రెస్, బీజేపీలు గంజాయి మొక్కల్లాంటి వారని.. వాటిని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తీసివేయాలన్నారు. ‘పేగులు మెడలో వేసుకుంటా, కత్తెరను జేబులో పెట్టుకొని తిరుగుతానంటూ రోతమాటలు, వెకిలి చేష్టలతో రాష్ట్రం పరువు తీస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎన్నటికీ పరిపాలనా దక్షుడు కాలేడు.. ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కులేదు’ అని ఆయన మండిపడ్డారు. కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన, అచ్చంపేటలో బీ ఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అధ్యక్షతన, గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రోడ్షోలలో కేటీఆర్ ప్రసంగించారు.
ఆరు గ్యారెంటీల్లో ఐ దింటిని అమలు చేశామని హోర్డింగ్లతో ప్రచారం చే సుకుంటున్న సీఎం రేవంత్రెడ్డికి సిగ్గుండాలని దుయ్యబట్టారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి, ఏ ముఖం పె ట్టుకుని ఓట్లు అడగటానికి గ్రామాల్లోకి వస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల వరకు ఓడ మల్లన్న.. ఎన్నికలయ్యాక బోడమల్లన్న అనే తీరుగా పాలనను విస్మరించి రాష్ర్టాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. లంకెబిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ బిందెలు ఉన్నాయంటు న్న రేవంత్రెడ్డికి ఇంతకుముందు కొండారెడ్డిపల్లిలో తాను చేసిన పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయేమోనం టూ సెటైర్లు వేశారు. హామీలను అమలు చేయకుండా.. పేగులు మెడలేసుకుంటా.. కత్తెర జేబులో పెట్టుకొని తి రుగుతానంటూ వ్యర్థపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ మార్క్ దో పిడీకి తెరలేపిందని విమర్శించారు. ప్రభుత్వ దవాఖానను కట్టించిన బంగారం లాంటి గువ్వల బాలరాజు ను.. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓడించారని.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. గ్యారెంటీలన్నీ గారడీలేనని ఎద్దేవా చేశారు. గుంపు మే స్త్రీ ప్రభుత్వం మెడలు వంచాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలన్నారు.
రాములును ఎంపీగా గెలిపిస్తే మోదీ ఏం చేసిండని బీజేపీలోకి పోయారో జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే కరెంట్, నీళ్లు, రైతుబంధు బాగుండెనన్నారు. మోచేతికి బెల్లం పెట్టిండ్రు, జాబ్ క్యాలెండరన్నరు.. ఏదీ దిక్కు లేదన్నారు. ఒక్కసారి మోసపోతే మోసం చేసినోళ్లది తప్పు, మళ్లీ మళ్లీ మోసపోతే తప్పు మనదే అవుతుందన్నారు. రాములు ను ఎంపీగా గెలిపిస్తే బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్లు చేశారన్నారు. ఈ ఎన్నికల్లో చోటా భాయ్ కాంగ్రెస్, బడే భాయ్ బీజేపీలతో బీఆర్ఎస్ పోటీపడుతుందని.. గులాబీ పార్టీకి అండగా నిలవాల్సిన బాధ్య త ప్రజలపై ఉన్నదన్నారు. ‘కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నోరు మెదపడం లేదు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడే ముఖం పెట్టుకొని ఓట్లు అడుగున్నారు.’ అని దుయ్యబట్టారు. ‘రామ మందిరం నిర్మిం చాం.. మాకే ఓట్లు వేయాలని అంటున్న బీజేపీ అం టోంది.. రాష్ట్రంలో కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయాన్ని నిర్మించారు.. ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారు.. కేంద్రం దీనికేమి సమాధానం చెప్తుంది’ అని ప్రశ్నించారు. క్రూడాయిల్ ధర తగ్గినా 34 శాతం పన్నులతో ప్రజలపై భా రం మోపుతూ అదానీ, అంబానీలకు సంపదను దోచిపెట్టిందని దుయ్యబట్టారు. రామమందిరం మినహా ఇంకేమైనా అభివృద్ధి చేసి ఉంటే ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
గద్వాల ఎమ్మెల్యేకు మాటలు తక్కువ.. చేతలు ఎ క్కువని కొనియాడారు. కేసీఆర్కు కృష్ణమోహన్రెడ్డి న మ్మకస్తుడని.. నియోజకవర్గ అభివృద్ధికి రూ.4,125 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశాడని గుర్తు చేశారు. జిల్లాలను రద్దు చేస్తే రేవంత్రెడ్డి మరో తెలంగాణ ఉద్యమా న్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లాలను ర ద్దు చేసే కాంగ్రెస్కు ఓటేస్తారో.. జిల్లా ఇచ్చిన కేసీఆర్కు ఓటేస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. సీఎం ఊసరవెల్లిలా రంగులు మార్చినట్లు హామీల అమలు తేదీలు మార్చుతున్నాడన్నారు. గద్వాల ఎమ్మెల్యే జలదీక్ష చేస్తే తప్పా ప్రజలకు తాగునీటి విషయంలో సన్నాసి రేవంత్రెడ్డి చొరవ చూపలేదన్నారు. నిర్మల్ సభలో రాహుల్గాంధీ మహిళల ఖాతాల్లో రూ.2,500 జమ చేస్తున్నామని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 10 నుంచి 12 సీట్లు గెలిస్తే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తాడని చెప్పారు. గద్వాలకు కేసీఆర్ మెడికల్, న ర్సింగ్ కళాశాలు ఇచ్చాడని, 300 పడకల దవాఖాన, వైద్య కళాశాల కోసం రూ.45 కోట్లు, జిల్లా దవాఖాన లో రూ.229కోట్లతో రోగులకు అవసరమైన సౌకర్యాలను కేసీఆర్ ప్రభుత్వం కల్పించిదన్నారు. జిల్లాను ర ద్దు చేస్తే ఇవన్నీ రద్దయ్యే అవకాశం ఉందని.. ప్రజ లు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. గ తంలో సర్కారు దవాఖాన అంటే రోగులు మే ము రాము బిడ్డో అనే వారని.. కేసీఆర్ పాలన లో సర్కారు దవాఖానకే పరుగులు పెట్టారని గుర్తు చేశారు.
కాళేశ్వరం, పాలమూర్-రంగారెడ్డి, నెట్టెంపాడ్ ప్రాజెక్టులను నిర్మించి రాష్ర్టా న్ని సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తే వాటిని కాంగ్రెసోళ్లు అడ్డుకున్నారని విమర్శించారు. జన్ధన్ ఖాతాల్లో రూ.15లక్షలు వే స్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని మోసం చేసిన బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించా రు. కృష్ణాబేసిన్లో మన వాటా తేల్చాలని పదేండ్లుగా అడుగుతున్నా కేం ద్రం పట్టించుకోలేదన్నారు. నడిగడ్డకు మోదీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్.. మోదీ లైన్లో ఉన్నాడని, పార్లమెంట్ ఎ న్నికల తర్వాత ఆయన బీజేపీలో చే రడం ఖాయమని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ స న్నాసులు అంటున్నారు.. ఇద్దరం ఒకటే అయితే తన చెల్లిని జైల్లో ఎందుకు పెడతారని ప్రశ్నించారు. గద్వాలలో రోడ్ షోకు వ చ్చిన జనాన్ని మిగతా ఏ జిల్లా రోడ్ షోలోనూ చూడలేదని.. ఇప్పుడే విజయోత్సవ ర్యాలీ చేసినట్లు ఉందన్నారు. ఐపీఎస్ అధికారిగా లక్షల మందికి సేవ చేసిన ఆర్ఎస్పీని ఎంపీగా గెలిపిస్తే ఇంకెంతమంది బా గుపడతారో గుర్తించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే సర్కారు మె డలు వంచి హామీలు అమలయ్యేలా చూస్తామన్నారు. రోడ్ షోల్లో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జీలు చాడ కిషన్రెడ్డి, రంగినేని అభిలాష్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అ భ్యర్థి నవీన్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు ఎడ్మ స త్యం, నర్సింహాగౌడ్, పుడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్, జెడ్పీటీసీలు విజితారెడ్డి, దశరథ్నాయక్, వైస్ఎంపీపీ గోవర్ధన్, విజయ్గౌడ్, గణేశ్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపించాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రజలను కోరారు. కాంగ్రెస్ మాటలు నమ్మి తే మరోసారి గోసపడి అభివృద్ధిలో వెనుకబడి పో తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరునెలలు కావస్తున్నా.. ఆరు గ్యారెంటీలు అమ లు చేయడం లేదన్నారు. ప్రవీణ్కుమార్ను పార్లమెంట్కు పంపితే మన నడిగడ్డను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ప్రజలకు వివరించారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు మాట్లాడుతూ మేధావి, విద్యావంతుడైన ఆర్ఎస్పీని గెలిపించాలని కోరారు. పేదల బతుకుల్లో మా ర్పు కోసం ఢిల్లీ గడ్డపై గళం విప్పేందుకు, కాంగ్రెస్ మోసాలు ఎండగట్డేందుకు కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు పార్లమెంట్ ఎన్నికల్లో రెండులక్షల మెజార్టీ ఇవ్వాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జై పాల్యాదవ్ కోరారు. విద్యావంతుడు, ఐపీఎస్గా సేవలందించిన వ్యక్తి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకులాలను బలోపేతం చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన ఆర్ఎస్పీని గెలిపిం చి ఢిల్లీకి పంపుదామన్నారు.