న్యూఢిల్లీ: సమాజ హితం కోసం దేశంలోని సామాజిక కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని, వారి కృషి ఎనలేనిదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురిపై ప్రశంసలు కురిపించారు.
విజయవాడకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ పడకండ్ల గురించి ప్రధాని ప్రస్తావించారు. శ్రీనివాస్ ఆటోమొబైల్ వ్యర్థాల నుంచి అద్భుతాలను సృష్టించారన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమల నుంచి సేకరించిన ఇనుప ముక్కలు, ఇతర వస్తువులతో విగ్రహాలను రూపొందించారని చెప్పారు. అలాంటి విగ్రహాలను అధికారులు పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో నెలకొల్పారని, వేలాదిమందిని అవి ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్స్ వ్యర్థాలను ఇలా రీసైక్లింగ్ చేయడం గొప్ప విషయమని ప్రధాని మెచ్చుకున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం తమిళనాడుకు చెందిన బస్ కండక్టర్ మారిముత్త యోగనాథన్ చేస్తున్న కృషిని కూడా ప్రధాని మోదీ కొనియాడారు. యోగనాథన్ తన బస్సులో వచ్చే ప్రతి ప్రయాణికుడికి టికెట్తో పాటు మొక్కను అందిస్తున్నారని చెప్పారు. ఆయన చర్యలు తోటి వారిలో స్ఫూర్తి నింపుతున్నాయని చెప్పారు. వివిధ రంగాల్లో సామాజిక కార్యకర్తలు చేస్తున్న కృషిని ప్రధాని మెచ్చుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
బీజేపీ మహిళా నేత ముఖంపై హానికర రంగులు చల్లిన దుండగులు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో కొనసాగుతున్నది: ప్రధాని
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
మిథాలీ రాజ్, పీవీ సింధుపై ప్రధాని ప్రశంసలు
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు