న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. మార్చి 8న ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్నామని, ఇదే నెలలో చాలామంది భారత మహిళా క్రిడాకారిణిలు తమ పేరిట సరికొత్త రికార్డులు నమోదు చేయడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. దేశంలో విజేతలుగా నిలిచిన పలువురు మహిళల గురించి ప్రస్తావించారు. మహిళా క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి భారత క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ నిలిచారని, ఆమె సాధించిన విజయానికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని చెప్పారు.
అదేవిధంగా పీవీ సింధు గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. సింధు అద్భుతమైన క్రీడా ప్రదర్శనలతో అనేక అవార్డులు అందుకున్నారని ప్రధాని గుర్తుచేశారు. మిథాలీ, సింధు ఇద్దరూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్లోనూ మహిళలు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారని, బంగారు పతకాల జాబితాలోనూ భారత్ ముందంజలో ఉన్నదని ప్రధాని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
బీజేపీ మహిళా నేత ముఖంపై హానికర రంగులు చల్లిన దుండగులు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో కొనసాగుతున్నది: ప్రధాని
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు