తమిళసూపర్స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రజినీకాంత్ హైదరాబాద్కు రానున్నాడు. నయనతార, కీర్తిసురేశ్, ఇతర తారాగణం రజినీకాంత్తో కలిసి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. నెల రోజులపాటు లాంగ్ షూటింగ్ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ మేరకు రజినీకాంత్ నెల రోజులు నగరంలోనే ఉండనున్నాడని ఫిలింనగర్ వర్గాల టాక్.
2020 డిసెంబర్ లో అన్నాత్తే షూటింగ్ సమయంలో చిత్రయూనిట్ సభ్యులకు కరోనా పాజిటివ్గా నిర్దారణ కావడంతో షూటింగ్ రద్దయింది. ఆ తర్వాత అస్వస్థతకు లోను కావడంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం చెన్నైకి వెళ్లారు. ఆరోగ్య కారణాల రీత్యా డాక్టర్ల సలహాల మేరకు డిసెంబర్ 31న పొలిటికల్ ఎంట్రీ ప్రకటనపై వెనక్కి తగ్గారు రజినీకాంత్. శివ దర్శకత్వంలో వస్తున్న అన్నాత్తేను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
యూత్ఫుల్గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్కల్యాణ్