తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లతోపాటు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయ్ తన ఇంటి నుంచి సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం విశేషం.
విజయ్ సైకిల్ రైడ్ చేస్తుంటే చాలా మంది అభిమానులు, ఫాలోవర్లు అతనికి సెక్యూరిటీగా నిలబడి బైకులపై పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. రాజకీయాలకు దూరంగా ఉండే విజయ్ అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని..ప్రజాస్వామ్య పద్దతిలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కదిలిరావాలని పిలుపునిచ్చారు. విజయ్ సైకిల్ రైడ్ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ సారి ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ పోటీలో ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కమల్హాసన్ కూతుళ్లు శృతిహాసన్, అక్షరహాసన్లతో కలిసి క్యూలైన్లో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకోవడం విశేసం. మరోవైపు రజనీకాంత్ కూడా ఓటు వేశారు.
ఇవి కూడా చదవండి
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
రష్మికకు మాజీ బాయ్ఫ్రెండ్ విషెస్..వీడియో
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్