హైదరాబాద్ : (Oil Palm summit) ఆయిల్ పామ్ సాగు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు హైదరాబాద్ వేదికగా కీలక సదస్సు జరుగనున్నది. వచ్చే నెల 18వ తేదీన ‘ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్’ పేరిట కేంద్ర ప్రభుత్వం ఒక రోజు సదస్సును నిర్వహించనున్నది. ఆయిల్ పామ్ సాగుపై తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక దృష్టి పెట్టడం, సాగు విస్తీర్ణం కూడా భారీగా పెరుగుతుండడంతో ఇక్కడే సదస్సు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్నది. ఈ సదస్సులో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బిహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.
దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపుతోపాటు మార్కెటింగ్కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో విపులంగా చర్చించనున్నారు. ఇటీవలే ఆయిల్ పామ్పై కేంద్ర ప్రభుత్వం నూతన పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీలో భాగంగా ఆయిల్ పామ్ పంటకు మద్దతు ధర కల్పించడం, రైతులకు సబ్సిడీలు పెంచడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ అంశాలను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రశాంత్కుమార్ మిశ్రా ప్రమాణం
మూడేండ్లుగా తెలంగాణలో అధిక వర్షాలు
జీడిమెట్లలో టిష్యూ కల్చర్ ల్యాబ్ పనులకు శంకుస్థాపన
ఇమ్రాన్ఖాన్-బజ్వా మధ్య పెరుగుతున్న దూరం.. కారణమేంటంటే..?
పిల్లల్ని అతిగా పొగడకండి.. ఎందుకో తెలిపిన బ్రిటన్ అధ్యయనం
సైకిళ్ల శ్మశానం.. ఎక్కడున్నదంటే..?!
లఖింపూర్ ఖేరీలో రైతు స్మారకం.. ఐదుగురు మృతుల విగ్రహాల ఏర్పాటు
బేబీ షవర్ ఫంక్షన్ జరుపుకున్న ఫ్రీదా పింటో
ట్రంప్కు సౌదీ రాజు ఇచ్చినవి నకిలీ బహుమతులంట.. దర్యాప్తులో బట్టబయలు
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజపేయి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..