హైదరాబాద్ : (Rains in Telangana) మూడేండ్లుగా తెలంగాణలో అధిక వర్షాలు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టుల ప్రభావంతో భూగర్భ జలాల మట్టం పెరుగుతున్నది. ఫలితంగా నీటిపై ఆధారపడి జీవించే అన్ని వర్గాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడననాలు పెరిగిపోయి భారీ వానలు కురుస్తుండటానికి నానాటికి సముద్ర జలాలు వేడెక్కుతుండటం కూడా కారణంగా చెప్పుకోవచ్చు.
తెలంగాణలో వాతావరణంపై మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణకు హరితహారం కార్యక్రమాల ప్రభావం చూపుతున్నది. గత మూడేండ్లుగా తెలంగాణలో అత్యధికంగా వానలు కురిశాయి. ఉమ్మడి రాష్ట్రంలో కరవు కాటకాలకు నిలయంగా మారిన తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రంగా మారిన అనంతరం వాతావరణ సమతుల్యతపై చేసిన కార్యక్రమాల వల్ల ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి ఏటా అతి తక్కువ వర్షం కురిసే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడ భారీ వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైందని స్థానికులు చెప్తున్నారు.
జీడిమెట్లలో టిష్యూ కల్చర్ ల్యాబ్ పనులకు శంకుస్థాపన
ఇమ్రాన్ఖాన్-బజ్వా మధ్య పెరుగుతున్న దూరం.. కారణమేంటంటే..?
పిల్లల్ని అతిగా పొగడకండి.. ఎందుకో తెలిపిన బ్రిటన్ అధ్యయనం
సైకిళ్ల శ్మశానం.. ఎక్కడున్నదంటే..?!
లఖింపూర్ ఖేరీలో రైతు స్మారకం.. ఐదుగురు మృతుల విగ్రహాల ఏర్పాటు
బేబీ షవర్ ఫంక్షన్ జరుపుకున్న ఫ్రీదా పింటో
ట్రంప్కు సౌదీ రాజు ఇచ్చినవి నకిలీ బహుమతులంట.. దర్యాప్తులో బట్టబయలు
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజపేయి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..