న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశీయ డైరెక్ట్ టూ-కన్జ్యూమర్(డీ2సీ) బ్రాండ్స్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే అత్యధిక వృద్ధి నమోదు చేసుకుంటుందని సర్వే వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నగరాల నుంచి అత్యధికంగా 66 శాతం వృద్ధి నమోదైందని యూనికామర్స్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ఆన్లైన్లో షాపింగ్ చేసేవారి సంఖ్య పెరగడం ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం భారత్లో డీ2సీ మార్కెట్ విలువ 10-12 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, 2030 నాటికి ఇది 30 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని సర్వే అంచనావేస్తున్నది.