టోక్యో : (Bicycle Cemetery) జపాన్ చాలా చిన్న దేశం. ఇండ్లు కట్టుకుని ఉండేందుకే స్థలం కరువై పోతున్న సమయంలో.. పనికిరాని వస్తువులను పెట్టడం అక్కడి వారికి తలనొప్పిగా మారింది. మరీ ముఖ్యంగా చెడిపోయిన సైకిళ్లు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. పాడైపోయిన సైకిళ్లను నిల్వచేసేందుకు స్థలం లేకపోవడంతో వాటిని యార్డుల్లో పడేస్తున్నారు. దాంతో సైకిళ్ల శ్మశానం తయారైంది.
జపాన్ ప్రజలు పెద్ద ఎత్తున సైకిళ్లను ఉపయోగిస్తున్నారు. చౌక ప్రయాణంతోపాటు ఆరోగ్యం కూడా పొందే సాధనం కావడంతో అక్కడి ప్రజలకు సైకిల్ ప్రియమైన వస్తువుగా తయారైంది. అదే సమయంలో, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వారు కోరుకుంటున్నారు. జపాన్లో 80 మిలియన్లకు పైగా సైకిళ్లు ఉండటానికి కారణం కూడా ఇదే.
అయితే, కొంతకాలంగా జపాన్లోని పలు నగరాల్లో సైకిళ్ల వినియోగం తగ్గినట్లు తెలుస్తున్నది. వాటిని ఇంట్లో ఉంచుకునేందుకు స్థలం లేకపోవడంతో వాటిని యార్డ్లో పడేస్తున్నారు. తక్కువ జనాభా ఉన్న సైతామా నగరం నుంచి దాదాపు 70 వేల సైకిళ్లు యార్డులో విసిరేశారు. దాంతో మినీ శ్మశానంగా తయారైంది. వీటిలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు సైకిళ్లు ఉన్నాయి. సైతామా మేయర్ హయాటో షిమిజు దీని గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సైకిళ్లను డంపింగ్ చేయడానికి బదులుగా అవసరమైన వారికి ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లఖింపూర్ ఖేరీలో రైతు స్మారకం.. ఐదుగురు మృతుల విగ్రహాల ఏర్పాటు
బేబీ షవర్ ఫంక్షన్ జరుపుకున్న ఫ్రీదా పింటో
ట్రంప్కు సౌదీ రాజు ఇచ్చినవి నకిలీ బహుమతులంట.. దర్యాప్తులో బట్టబయలు
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజపేయి
హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించిన షుగర్.ఫిట్
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..