హైదరాబాద్: (Sugar.fit) మధుమేహం.. చాప కింది నీరులా ప్రవహిస్తూ ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ప్రస్తుతం మన దేశంలో 7.7 కోట్ల మంది డయాబెటిస్తో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ప్రతి ఏడుగురిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. డయాబెటిస్ను రివర్స్ చేయడంలో విశేషంగా కృషిచేస్తున్న షుగర్.ఫిట్ సంస్థ ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించింది. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి ఈ సంస్థ ప్రజలకు సరైన రీతిలో సహాయ సహకారాలు అందజేయనున్నది. హైదరాబాద్ కన్నా ముందు మూడు మార్కెట్లలో షుగర్.ఫిట్ సంస్థ ప్రవేశించినట్లు సంస్థ వెల్లడించింది.
దేశంలోని 7 కోట్ల మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు, 8 కోట్ల మంది ప్రీ-డయాబెటిక్ రోగులకు సహాయం చేసేందుకు షుగర్.ఫిట్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. ఇది నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ సాంకేతికతను (సీజీఎం) ఉపయోగించి తమ వద్దకు వచ్చే రోగుల్లోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నమోదు చేస్తుంది. జీవక్రియ ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి తమ వినియోగదారుల రక్తంలో చక్కెర స్థాయిపై వివిధ ఆహార, జీవనశైలి కార్యకలాపాల రియల్ టైమ్ ప్రభావాన్ని కనిపెట్టేందుకు సహాయపడుతుంది. తమ ఏడాది సమగ్ర కార్యక్రమంలో భాగంగా లోతైన సాంకేతికత, కోచింగ్, వ్యక్తిగతంగా సిద్ధం చేసిన విశ్లేషణలు, ఇంటిగ్రేటెడ్ పరికరాలు, పరీక్షలతో వైద్య నిపుణులను అందుబాటులోకి తీసుకొస్తుంది.
‘జూన్ చివరిలో మా కార్యకలాపాలను ప్రారంభించాం. బెంగుళూరు, ఎన్సీఆర్, చెన్నైలలో ఇప్పటికే సేవలను అందిస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చాం. త్వరలోనే ముంబైలో కూడా సేవలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని షుగర్.ఫిట్ సహ వ్యవస్థాపకుడు మదన్ సోమసుందరం తెలిపారు. ప్రతినెలా రెండు నగరాల్లో తమ సంస్థ సేవలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 2021 చివరికల్లా 15 నగరాల్లో తమ సంస్థ సేవలను విస్తరిస్తామని, రానున్న ఏడాది కాలంలో మరో 15 నగరాల్లో షుగర్.ఫిట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తులను తమ సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
షుగర్.ఫిట్ సంస్థ ఇప్పటివరకు 10 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. డిజిటల్ ప్లాట్ఫాంతో పాటు భౌతిక మౌలిక సదుపాయాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నది. ప్రస్తుతం, బీ2సీ సెగ్మెంట్పై దృష్టి పెట్టిన షుగర్.ఫిట్.. భవిష్యత్లో దవాఖానలతో కలిసి పని చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఆర్థరైటిస్… కీళ్లపై ప్రభావం.. ఇవి పాటిస్తే చాలు హాయి!
పెరిగిన పెట్రో ధరలతోనే కొవిడ్ వ్యాక్సిన్లు : కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి
పెద్ద మొత్తం డాలర్లతో అష్రఫ్ ఘనీ పరారీ.. ఆధారాలు ఉన్నాయంటున్న సెక్యూరిటీ చీఫ్
మృత్యువు ముంగిట.. తండ్రిని కలిసిన కొడుకు
లఖింపూర్ మృతులకు నివాళులు.. సీతాపూర్లో ప్రియాంక అడ్డగింత
శ్రీనగర్లో కశ్మీరీ పండిట్ల ప్రదర్శన.. ముస్లింల మద్దతు
స్పేస్ సూట్ ధరించకుండా అంతరిక్షంలోకి వ్యోమగాములు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..