న్యూఢిల్లీ, ఆగస్టు 6 : టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. దేశంలో తమ నాల్గో క్లౌడ్ రీజియన్ను హైదరాబాద్లో అందుబాటులోకి తెచ్చినట్టు గురువారం ప్రకటించింది. దీంతో నగరం నుంచి వీలైన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు, వర్క్లోడ్లను నడిపించడానికి ఇక కస్టమర్లకు అవకాశం లభించిందని పేర్కొన్నది.
ఇప్పటికే కంపెనీకి పుణె, చెన్నై, ముంబైలు క్లౌడ్ రీజియన్లుగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు వీటికి హైదరాబాద్ తోడైంది. కాగా, భారత్లో 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్.. అందులో భాగంగానే ఈ క్లౌడ్ రీజియన్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది.