న్యూఢిల్లీ: పోలీసుల జాగిలాలు ఎన్నో సందర్భాల్లో కీలక ఆపరేషన్స్లో పాల్గొన్నాయి. ఇక ఇప్పుడు ఆర్మీ శునకాలు(Army Dogs) ఏకంగా పారాచూట్ శిక్షణలో పాల్గొంటున్నాయి. ఏరియల్ ఆపరేషన్స్కు కూడా అవి సిద్ధం అవుతున్నాయి. సెంట్రల్ ఇండియాలోని బేహట్ డ్రాప్ జోన్లో ఓ ఆర్మీ పారాట్రూపర్ తన శునకంతో కలిసి విమానం నుంచి జంప్ చేశాడు. డాగ్ హ్యాండ్లర్ కూడా ఆ జంప్లో పాల్గొన్నాడు. పూర్తి స్థాయి కంబాట్ లోడ్తో జంప్ చేశారు.
భారతీయ ఆర్మీ తొలిసారి సుశిక్షత శునకాలతో పారాచూట్ జంపింగ్ నిర్వహించింది. సైనికుడు, శునకం మధ్య అసాధారణా అనుబంధం ఏర్పడినట్లు సెంట్రల్ కమాండ్ తన పోస్టులో పేర్కొన్నది. అమెరికాలోని యూఎస్ నేవీ సీల్స్కు చెందిన దళాల్లో ఎయిర్బార్న్ ఆపరేషన్స్లో పాల్గొనే శునకాలు ఉన్నాయి. పాక్లోని ఒసామా బిన్ లాడెన్ను హతమార్చేందుకు ఆ శునకాన్ని వాడారు.
An #IndianArmy Paratrooper conducted a tandem parachute jump with a Dog Handler and his K-9 carrying full combat load over Behat DZ for the first time. pic.twitter.com/cInblbn6p3
— IADN (@NewsIADN) September 15, 2026