బెంగళూరు, ఆగస్టు 6 : ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పంపిణీ వ్యాపారంలోకి ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ యాప్ ఫోన్పే ప్రవేశించింది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల భాగస్వామ్యంతో ఫోన్పే తమ యూజర్లకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నది.
అలాగే శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఓ డిజిటల్ డైలీ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)నూ తీసుకొచ్చింది. యూపీఐ ఆటోపే ద్వారా రోజుకు రూ.100-1,000 ఎంతైనా యూజర్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని గురువారం ఫోన్పే తెలిపింది.