తిరువనంతపురం : (Kerala Rains) కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏడు జిల్లాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలలో వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా తిరువనంతపురం జిల్లాలోని అరువుక్కర, నెయ్యార్ మరియు పెప్పర రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ అదనపు బృందాలు కేరళలో మోహరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు బృందాలు ఉండగా, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అభ్యర్థన మేరకు తమిళనాడు అరక్కోణం నుంచి మరో నాలుగు బృందాలు ఇక్కడికి వస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలప్పుజ, ఎర్నాకుళం, కొల్లం, కొట్టాయం జిల్లాల్లో, మరొక బృందం పతనంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో మోహరించారు.
మలప్పురంలో భారీ వర్షం కారణంగా కుప్పకూలిన ఇంట్లో ఇద్దరు పిల్లలు మరణించారు. మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడడంతో భవనం కూలిపోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారులను స్థానికులు కోజికోడ్ వైద్య కళాశాల దవాఖానకు తరలించినప్పటికీ.. వారు మార్గమధ్యంలో చనిపోయారు. కొల్లాంలో 65 ఏండ్ల వ్యక్తి లోయలో పడి మరణించాడు.
హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించిన షుగర్.ఫిట్
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఆర్థరైటిస్… కీళ్లపై ప్రభావం.. ఇవి పాటిస్తే చాలు హాయి!
పెరిగిన పెట్రో ధరలతోనే కొవిడ్ వ్యాక్సిన్లు : కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి
పెద్ద మొత్తం డాలర్లతో అష్రఫ్ ఘనీ పరారీ.. ఆధారాలు ఉన్నాయంటున్న సెక్యూరిటీ చీఫ్
మృత్యువు ముంగిట.. తండ్రిని కలిసిన కొడుకు
లఖింపూర్ మృతులకు నివాళులు.. సీతాపూర్లో ప్రియాంక అడ్డగింత
శ్రీనగర్లో కశ్మీరీ పండిట్ల ప్రదర్శన.. ముస్లింల మద్దతు
స్పేస్ సూట్ ధరించకుండా అంతరిక్షంలోకి వ్యోమగాములు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..