న్యూఢిల్లీ : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధాన అడుగు వేసింది. బ్యాటరీతో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్లకు ఉచితంగా చేయనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేయడం లేదా పునరుద్ధరించడానికి ఎటువంటి ఛార్జీలను వసూలు చేయరని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్ మార్కుల జారీకి కూడా ఎలాంటి రుసుం వసూలు చేయరని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల ఈ-స్కూటర్ లేదా బైక్ కొనుగోలు ఖర్చు కనీసం రూ.1,000 తగ్గుతుందని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వింకేశ్ గులాటి చెప్పారు. ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసే కస్టమర్లు కూడా రూ.4,000 వరకు లబ్ధి పొందుతారు. జూలై ఆరంభంలో ఫేమ్-2 పథకం కాలపరిమితిని రెండు సంవత్సరాల పాటు 2024 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. అంతకు ముందు ఈ పథకం 2022 ఏప్రిల్ నెలలో ముగుస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలు తమ స్థాయిలలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడం సులభతరం చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్రాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి పలు ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభించాయి.గత నెలలో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ప్రోత్సాహక విధానాన్ని అమలు చేశాయి. ఈ విధానం ఇప్పటికే మూడు ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్నది. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధర దాదాపు సగానికి సగం తగ్గింది. 20 రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ప్రక్రియలో పాలసీని సిద్ధం చేస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభించిన రాష్ట్రాలలో వీటి ధరల్లో 40 శాతం వరకు భారీ తగ్గింపు ఉండనున్నది.
బిల్లుకు మద్దతు తెలిపి ఇప్పుడు ఆందోళనలా?
రక్షణ మంత్రి టార్గెట్గా కార్ బాంబు దాడి
ఆసియా తొలి న్యూక్లియార్ రియాక్టర్ ప్రారంభం
ఇక కల్తీ మద్యం అమ్మితే ఉరిశిక్షే..ఎక్కడంటే..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..