భారతదేశంలో తొలి న్యూక్లియార్ రియాక్టర్ (Nuclear Reactor) 1956 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైంది. దీనికి అప్సర అని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టారు. ఇది భారతదేశంలోనే కాకుండా ఆసియా దేశాల్లోనే తొలి రియాక్టర్ కావడం విశేషం. చాలా సంవత్సరాలపాటు సేవలందించిన ఈ రియాక్టర్ను కేంద్రం 2009 లో మూసేశారు. కొన్ని మరమ్మతులు చేపట్టి 2018 లో తిరిగి రెండోసారి అందుబాటులోకి తీసుకొచ్చారు.
భారతదేశంలో అణు విద్యుత్కు ఆద్యుడైన హోమీ జెహంగీర్ భాభా 1954 లో అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రోంబే (ఏఈఈటీ) స్థాపించారు. భారతదేశంలో అణుశక్తి రంగంలో పరిశోధనను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా అణు రియాక్టర్ల రూపకల్పన, అభివృద్ధిపై పనిచేస్తున్న ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఈ కేంద్రంలో పనిచేయడానికి రావాలని డాక్టర్ భాభా పిలుపునిచ్చారు. 1955 మార్చి 15 న భారతదేశంలో మొదటి అణు పరిశోధన రియాక్టర్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మొత్తం కార్యక్రమానికి డాక్టర్ భాభా అధిపతిగా ఉన్నారు. ఈ రియాక్టర్ ఒక స్విమ్మింగ్ పూల్ మాదిరిగా, 1 ఎండబ్ల్యూ థర్మల్ సామర్థ్యాన్ని కలిగి ఉండాలని నిర్ణయించారు. పరిశోధనా రియాక్టర్ నిర్మాణ పనులు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. రియాక్టర్ కోసం యురేనియంను సరఫరా చేయడానికి బ్రిటన్-భారతదేశం మధ్య ఒప్పందం కుదిరింది.
దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరూ కేవలం 15 నెలల్లోనే రియాక్టర్ పనిని పూర్తి చేయడానికి పగలు, రాత్రి కష్టపడ్డారు. చివరకు విజయవంతంగా 1956 లో సేవలందించడం ప్రారంభించింది. భారతదేశంతో పాటు మొత్తం ఆసియాలో ఇది మొదటి అణు రియాక్టర్. రియాక్టర్ సామర్థ్యాన్ని, నిర్వహణను పెంచడానికి దీనిని 2009 లో మూసివేశారు. రియాక్టర్ సామర్థ్యాన్ని 1 నుంచి 2 మెగావాట్ల థర్మల్కు పెంచారు. ఇంధనం కూడా భారతదేశంలోనే తయారు చేయబడింది. దాంతో ఈ రియాక్టర్ను 2018 సెప్టెంబర్ 10 న పునఃప్రారంభించారు.
2018: లైవ్ టీవీ ఈవెంట్లో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై డ్రోన్ దాడి
2007: అంగారకుడిపై పరిశోధనకు ఫీనిక్స్ను ప్రయోగించిన అమెరికా
1961: అమెరికా తొలి నల్లజాతి అధ్యక్షుడు బరాక్ ఒబామా జననం
1944: రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్ సైనికుల నుంచి తప్పించుకునేందుకు అన్నే ఫ్రాంక్ కుటుంబం ఏర్పాటు చేసుకున్న రహస్య స్థావరాన్ని కనుగొన్న జర్మన్ దళాలు
1922 : గ్రాహం బెల్మృతికి నివాళిగా అమెరికా, కెనడా దేశాల్లో నిమిషం పాటు టెలీఫోన్లను నిలిపివేసిన పౌరులు
1914: మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ చేరిన తర్వాత, బ్రిటన్ కూడా యుద్ధంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది
ఇక కల్తీ మద్యం అమ్మితే ఉరిశిక్షే..ఎక్కడంటే..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..