బీజింగ్ : చైనాలో ప్రారంభమై.. ప్రపంచ దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్.. ఇప్పుడు మళ్లీ చైనాలో కలకలం సృష్టిస్తోంది. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన వుహాన్ నగరం (Wuhan corona) లో ఏడాది తర్వాత కరోనా సోకిన వ్యక్తిని గుర్తించారు. దాంతో అక్కడి ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఎవరికి కరోనా అంటుకుంటుందో అని, ఎవరిని ఐసోలేషన్లో ఉంచుతారో అని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వుహాన్లో ఒక సంవత్సరం తర్వాత కరోనా రోగి బయటకు రావడంతో కలకలం రేగింది. దాంతో ప్రతి పౌరుడికి పరీక్షలు జరుపనున్నారు. వుహాన్ నగరంలో కోటి మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో కొత్త కరోనా కేసు కారణంగా ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొన్నది. 2019 చివరలో వుహాన్ నగరంలో మొదటి కరోనా ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. ఆ తర్వాత దాని ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రపంచంలోని ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం ప్రారంభించింది. కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరవాసులందరిపై ప్రభుత్వం కరోనా ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తున్నట్లు వుహాన్ నగర సీనియర్ అధికారి లి టావో మంగళవారం మీడియాకు చెప్పారు.
అక్కడి మీడియా నివేదికల ప్రకారం, చైనాలో మంగళవారం 61 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలోని కనీసం 18 ప్రావిన్సుల్లో గత 10 రోజుల్లో 300 డొమెస్టిక్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఇది చైనాకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా మరోసారి సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
వుహాన్లో వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందిన తర్వాత చైనా తన ప్రజలను ఇళ్లలో బంధించింది కఠిన చర్యలు తీసుకున్నది. అలాగే, దేశీయ రవాణా సౌకర్యాలను కూడా మూసివేశారు. కరోనా వైరస్పై పరిశోధించేందుకు భారీ ప్రచారం ప్రారంభించారు. దాంతో చాలా వరకు చైనాలో కరోనా కేసులు కట్టడయ్యాయి.
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తొలిసారి ఇంట్లోకొచ్చిన కంప్యూటర్ టీఆర్ఎస్-80
దోమల జనాభా నియంత్రణ ద్వారా మలేరియాకు చెక్!
కరోనా వ్యాక్సిన్తో క్యాన్సర్కు అడ్డుకట్ట
ఇక్కడ ముద్దులు నిషేధం.. ముంబైలో స్పెషల్ జోన్
స్పెషల్ ఒలింపిక్స్లో ఇండియాకు సోనూ సూద్ నాయకత్వం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..