ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లకు స్ఫూర్తిగా నిలిచిన టీఆర్ఎస్-80 కంప్యూటర్ (First Home Computer) 44 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మన గడపను దాటి ఇంట్లోకొచ్చింది. 12 అంగుళాల మానిటర్ను కలిగి ఉండి, 4 కేబీ ర్యామ్తో అలరించాయి. అప్పట్లో ఈ కంప్యూటర్ ఖరీదు 599 అమెరికన్ డాలర్లుగా ఉండేది. 1977 లో టాండీ కార్పొరేషన్ను ఈ కంప్యూటర్ను ఇళ్లలో వాడుకునేందుకు సిద్ధం చేసింది.
దీనికన్నా ముందు అమెరికాలో నివసించే డాన్ ఫ్రెంచ్ అనే వ్యక్తి మ్యూజిక్ అంటే చెవి కోసుకునేవాడు. రేడియో షాక్లో కనిపించే ఎలక్ట్రానిక్ వస్తువులను ఇష్టపడుతూ.. నిత్యం రేడియో షాక్కి వెళ్లి ఏదో ఒకటి కొనేవాడు. 1975 లో అతను ఆల్టెయిర్ 8800 ను కొనుగోలు చేశాడు. అది మైక్రో కంప్యూటర్. డాన్ ఫ్రెంచ్ దీన్ని బాగా ఇష్టపడ్డాడు. సాధారణ ప్రజల కోసం ఇలాంటి ఉత్పత్తిని ఎందుకు డిజైన్ చేయకూడదని ఆలోచించాడు. నిజానికి, ఆ సమయంలో కంప్యూటర్ కేవలం సాంకేతిక రంగంలో ఆసక్తి ఉన్న వ్యక్తులు మాత్రమే వినియోగించేవారు.
డాన్ ఫ్రెంచ్ ఈ ఆలోచనను రేడియో షాక్ మాతృ సంస్థ టాండీ కార్పొరేషన్తో పంచుకున్నాడు. సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించి.. ఈ పని నిమిత్తం 24 ఏండ్ల యువ ఇంజనీర్ స్టీవ్ లైనింగ్ర్ను నియమించింది. స్టీవ్, డాన్ ఈ కొత్త కంప్యూటర్ రూపకల్పన బాధ్యతను స్వీకరించారు.
నెలల తరబడి ఇద్దరూ కష్టపడి తక్కువ ధరలో కంప్యూటర్ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యం చేరుకున్నారు. కొన్నిరోజుల తర్వాత వీరు తయారుచేసిన ప్రోటోటైప్కు టాండీ కార్పొరేషన్ ఆమోదించి.. దానికి టీఆర్ఎస్-80 (టాండీ రేడియే షాక్) అని పేరు పెట్టారు. జడ్80 ప్రాసెసర్ను వాడినందున పేరులో 80 చేర్చారు. దీనిలో కస్టమర్కు భాషా అనువాదకుడితోపాటు 4 కేబీ ర్యామ్, 1.77 MHz z-80 ప్రాసెసర్, 12 అంగుళాల మానిటర్, క్యాసెట్ రికార్డర్, క్యాసెట్ టేప్ ఇచ్చారు. క్యాసెట్లో బ్లాక్జాక్, బ్యాక్గేమ్ అనే రెండు ఆటలు కూడా ఉండేవి.
కంపెనీ అంచనాల కంటే ఈ కంప్యూటర్కు ఎక్కువ స్పందన వచ్చింది. మొదటి నెలలోనే 5,000 కంప్యూటర్లు అమ్ముడుపోయాయి. ఇది కంపెనీ అంచనా కంటే 10 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.
2012: లండన్ ఒలింపిక్స్లో 17 వ బంగారు పతకం సాధించి రికార్డు నెలకొల్పిన అమెరికన్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్
1958: యుఎస్ఎస్ జలాంతర్గామి యుఎస్ఎస్ నాటిలస్ ఉత్తర ధ్రువాన్ని దాటిన మొదటి జలాంతర్గామిగా నిలిచింది
1948: ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ స్థాపన
1946: అమెరికాలో మొదటి థీమ్ పార్క్ ‘శాంతా క్లాజ్ ల్యాండ్’ ప్రారంభం
1914: ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించిన జర్మనీ
1492: భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనే లక్ష్యంతో స్పెయిన్ నుండి యాత్రను ప్రారంభించిన క్రిస్టోఫర్ కొలంబస్
దోమల జనాభా నియంత్రణ ద్వారా మలేరియాకు చెక్!
కరోనా వ్యాక్సిన్తో క్యాన్సర్కు అడ్డుకట్ట
ఇక్కడ ముద్దులు నిషేధం.. ముంబైలో స్పెషల్ జోన్
స్పెషల్ ఒలింపిక్స్లో ఇండియాకు సోనూ సూద్ నాయకత్వం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..