లండన్ : ఆడ దోమలను సంతానలేమిగా చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మలేరియాను (Prevent Malaria) తొలగించేందుకు శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. మలేరియా నిర్మూలనకు చేపట్టిన పరిశోధనల సమయంలో 560 రోజుల్లో దోమల సంఖ్య తగ్గించి ఫలితాలను రాబట్టారు. మలేరియాను మోసే ఆడ దోమలను జన్యు సవరణ పద్ధతుల ద్వారా వంధ్యత్వానికి గురిచేయడమనే కొత్త టెక్నిక్ను రూపొందించారు.
ప్రపంచవ్యాప్తంగా మలేరియా కారణంగా ప్రతి ఏటా లక్షల మంది మరణిస్తున్నారు. ఈ మరణాలను తగ్గించడానికి, మలేరియా కేసులను తగ్గించడానికి శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం చేపట్టారు. దోమల జనాభాను నియంత్రించడానికి సీఆర్ఐఎస్పీఆర్ జన్యు సవరణ పద్ధతులను ఉపయోగించి శాస్త్రవేత్తలు.. మలేరియాకు కారణమయ్యే ఆడ దోమలను వంధ్యత్వానికి గురి చేశారు. ఈ టెక్నిక్ మలేరియా గేమ్ ఛేంజర్గా నిరూపించబడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
లండన్లోని ఇంపీరియల్ కాలేజ్, లివర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ సంయుక్తంగా దీనిపై పరిశోధన చేస్తున్నాయి. తొలిసారిగా శాస్త్రవేత్తలు ఆడ దోమల యొక్క జన్యువులను పునరుత్పత్తి చేయలేనట్లుగా మార్చారు. దీని కోసం అనాఫిలిస్ గాంబీ జాతి దోమలను పరిశోధకులు ఎంచుకున్నారు. సబ్సహారా ఆఫ్రికాలో మలేరియా వ్యాప్తికి ఈ జాతి బాధ్యత వహిస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా 3,500 కంటే ఎక్కువ రకాల దోమలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటిలో కొన్ని మాత్రమే మలేరియాను వ్యాప్తి చేస్తుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, 2019 లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 23 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. 4 లక్షల మందికి పైగా మరణించారు. ఈ మరణాలలో చాలా వరకు 5 ఏండ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు ఉన్నారు.
70 సంవత్సరాల పాటు చేసిన నిరంతర ప్రయత్నాల అనంతరం చైనా ఇటీవల మలేరియా నుంచి విముక్తి పొందింది. చైనాను మలేరియా రహితదేశంగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. 1940 లలో చైనాలో ప్రతి సంవత్సరం 3 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో గత 4 సంవత్సరాలలో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాని మొదటి దేశంగా చైనా నిలిచింది.
మలేరియాను నియంత్రించడానికి చైనా 2012 లో 1-3-7 వ్యూహాన్ని అమలు చేసింది. ఆరోగ్య సంరక్షణ కార్మికులకు లక్ష్యాలు నిర్దేశించారు. వ్యూహం ప్రకారం, మలేరియా కేసును 1 రోజులోపు నివేదించడం తప్పనిసరి చేశారు. ఈ అంశంపై 3 రోజుల్లో విచారణ జరిపి, దాని నుంచి ప్రమాదాన్ని తెలుసుకోవాలి. అదే సమయంలో ఈ కేసు వ్యాప్తిని 7 రోజుల్లో నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించడం ద్వారా విజయవంతంగా మలేరియా నుంచి చైనా విముక్తి పొందింది.
కరోనా వ్యాక్సిన్తో క్యాన్సర్కు అడ్డుకట్ట
పారాలింపిక్ షూటర్కు ‘సుప్రీం’లో ఊరట
పెగాసస్పై దర్యాప్తు చేయాలి : సీఎం నితీష్ కుమార్
ఇక్కడ ముద్దులు నిషేధం.. ముంబైలో స్పెషల్ జోన్
ఈ చట్టం కింద ఇంకా కేసులా?.. సుప్రీంకోర్టు షాక్
స్పెషల్ ఒలింపిక్స్లో ఇండియాకు సోనూ సూద్ నాయకత్వం
చరిత్రలో ఈరోజు.. భారత ప్రభుత్వ చట్టం ఆమోదం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..