Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని సుమారు 50 పాఠశాలలకు బుధవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లోని పలు ప్రముఖ స్కూళ్లకు బుధవారం ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. రాజధానిలోని ద్వారక, వసంత్ కుంజ్, తూర్పు మయూర్ విహార్లోని మదర్ మేరీ స్కూల్, సంస్కృతి స్కూల్, పుష్ప విహార్లోని అమిటీ స్కూల్, సౌత్ వెస్ట్ ఢిల్లీలోని డీఏవీ స్కూల్స్కు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అదేవిధంగా నోయిడాలోని సుమారు 12 పాఠశాలలకు (Noida schools) కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు చెప్పారు.
#WATCH | Delhi: Visuals from BGS International Public School, Dwarka which received an email regarding a bomb threat. As a precautionary measure, the students are sent back home.
According to Delhi Police, several schools have received emails regarding the bomb threat today.… pic.twitter.com/El4alruDSD
— ANI (@ANI) May 1, 2024
దీంతో అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు అధికారులు ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బందిని ఇంటికి పంపించేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే, అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలూ వారికి కనిపించలేదు. దీంతో కేసు నమోదు చేసుకొని ఈమెయిల్ ఐపీ అడ్రెస్ ద్వారా ఆగంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి ఇన్నిపాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
#WATCH | Dog Squad and Bomb Disposal Squad conduct checking at Delhi Public School, Noida, which received an email regarding a bomb threat this morning. pic.twitter.com/NqTA66phah
— ANI (@ANI) May 1, 2024
మరోవైపు ఈ బాంబు బెదిరింపులపై ఢిల్లీ మంత్రి అతిషీ (Delhi Minister Atishi) స్పందించారు. ఢిల్లీ పోలీసులు, పాఠశాల అధికారులతో ప్రభుత్వ అధికారులు నిరంతరం టచ్లో ఉన్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ భయపడొద్దని తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. ‘ఈరోజు ఉదయం కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విద్యార్థులను వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఆయా పాఠశాలల ప్రాంగణాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పాఠశాలలోనూ ఎలాంటి పేలుడు పదార్థాలూ లభ్యం కాలేదు. మేము పోలీసులు, పాఠశాలల యాజమాన్యాలతో నిరంతరం టచ్లో ఉన్నాము. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు భయపడొద్దు’ అని అతిషీ ఎక్స్లో రాసుకొచ్చారు.
Some schools have received bomb threats today morning. Students have been evacuated and those premises are being searched by Delhi Police. So far nothing has been found in any of the schools.
We are in constant touch with the Police and the schools. Would request parents and…
— Atishi (@AtishiAAP) May 1, 2024
కాగా, దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా చెన్నై, ముంబైలోని పలు పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఢిల్లీలో పలు స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. దీంతో అది నకిలీ బెదిరింపు అయి ఉంటుందని పోలీసులు అప్పట్లోనే వెల్లడించారు. అంతేకాదు, పలు విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఇలా దేశంలోని పలు పాఠశాలలు, ప్రముఖ సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
#WATCH | Visuals from Delhi Public School, Noida which received an email regarding a bomb threat. As a precautionary measure, the students are sent back home.
According to Delhi Police, several schools have received emails regarding the bomb threat today. Investigation is… https://t.co/TQ6Z2dOp67 pic.twitter.com/RSFqukW3ZR
— ANI (@ANI) May 1, 2024
Also Read..
Gas price | కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. మరి డొమెస్టిక్ సిలిండర్లకు..?
Divorced daughter | భర్తకు విడాకులిచ్చిన బిడ్డను మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి..!
Ajith Kumar | అజిత్ కుమార్కు భార్య షాలినీ సర్ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్.. ఇంతకీ ఏంటో అది..!