గువాహటి: అసోంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.51 గంటలకు సోనిత్పూర్లో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దాని తీవ్రత 6.4గా నమోదయ్యింది. భూకంప తీవ్రతతో నగౌన్లోని పక్కపక్కనే ఉన్న రెండు ఇళ్లులు కొద్దిగా కదిలాయి. ఒక ఇళ్లు మరో ఇంటిపైకి ఒరిగిపోయింది. అయితే భూప్రకంపణలు ప్రారంభంకాగానే ఇళ్లలోని జనాలు బయటకు పరుగులు తీశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది.
#WATCH Assam | A building in Nagaon tilts against its adjacent building. An earthquake with a magnitude of 6.4 on the Richter Scale hit Sonitpur today. Tremors were felt in Nagaon too. pic.twitter.com/03ljgzyBhS
— ANI (@ANI) April 28, 2021
అసోంలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో రెండు సార్లు భూమి కంపించింది. ఉదయం 7.51 గంటల ప్రాంతంలో సోనిత్పూర్లో రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. ఆ తర్వాత 8.13 గంటలకు, 8.34 గంటలకు మూడోసారి ప్రకంపనలు వచ్చాయి. వరుసగా మూడుసార్లు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురై, ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. 6.4 తీవ్రతతో వచ్చిన భూకంపంతో ఉత్తర బెంగాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి.
కూచ్ బెహార్, మాల్దా, జల్పాయిగురి, సిలిగురి, ముర్షిదాబాద్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. అలాగే మేఘాలయలోనూ పలు ప్రాంతాలోనూ ప్రభావం కనిపించింది. తేజ్పూర్కు పశ్చిమ నైరుతి దిశలో 43 కిలోమీటర్ల దూరంలో భూపంక కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ తెలిపింది.
భూకంపంపై సీఎం సర్బానంద సోనావాల్స్పందించారు. అసోంలో భారీ భూకంపం వచ్చిందని, అందరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. వరుస ప్రకంపనల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నట్లు చెప్పారు. భారీగా వచ్చిన ప్రకంపనలతో భవనాలు దెబ్బతిన్నాయి. ఫొటోలను హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు.
#WATCH Assam | Cracks appeared on a road in Sonitpur
— ANI (@ANI) April 28, 2021
as a 6.4 magnitude earthquake hit the region this morning. pic.twitter.com/WfP7xWGy2q
ఇదిలా ఉండగా బీహార్లోనూ రాత్రి 2.29 గంటల సమయంలోనూ రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో బలమైన ప్రకంపనలు వచ్చాయి. కతిహార్, కిసాన్గంజ్, ఖడ్జియా ప్రాంతాల్లో భూమి కంపించింది.
ఇవికూడా చదవండి..