Fire Accident | రాయపోల్, ఆగస్టు 04 : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధం కాగా భారీ ఆస్తి నష్టం జరిగిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన పబ్బ అశోక్ గుప్త కుటుంబ సభ్యులతో తన ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఆదివారం అర్ధరాత్రి కూలర్కు షార్ట్ సర్క్యూట్ రావడంతోపెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
అయితే అగ్నిప్రమాదంలో ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో పబ్బ అశోక్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ కంటనీరు పెట్టుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వలన తమకు భారీ నష్టం జరిగిందని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దౌల్తాబాద్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాద సంఘటన మూలంగా తీరని నష్టం వాటిల్లిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పబ్బ అశోక్ కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. అగ్ని ప్రమాద సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి మనోధైర్యం అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రహీముద్దీన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, నాయకులు నరసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, నాగరాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Kollapur | ఎంపీ మల్లు రవికి వ్యతిరేకంగా కొల్లాపూర్లో కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో
Veerabhadram | దేశ సమగ్రతను, ఆర్థిక రంగాన్ని కాపాడాలి : తమ్మినేని వీరభద్రం
Juluruapadu : మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బాపట్ల మురళి