జూలూరుపాడు, ఆగస్టు 04 : తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా జూలూరుపాడుకు చెందిన బాపట్ల మురళి నియమితులయ్యారు. శంషాబాద్లో జరిగిన రాష్ట్ర సమావేశంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తమరావు పటేల్ నియామక పత్రం అందజేశారు. తనకు రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించిన సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తమరావు పటేల్కు మరళి కృతజ్ఞతలు తెలిపారు.