CI Latheef | తొగుట, డిసెంబర్ 06 : గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావు పేట, లింగంపేట పెద్ద మా మాసాన్ పల్లి, కాన్గల్తోపాటు పలు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ షేక్ లతీఫ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించడానికే గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు నిర్భయంగా పోలింగ్లో పాల్గొనాలని తెలిపారు.
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడరాదని ప్రజలను హెచ్చరించడమైనది. ఎవరైన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైనా ర్యాలీ లేదా బహిరంగ సభ నిర్వహించాలంటే తప్పనిసరిగా సంబంధిత మండల తహసీల్దార్, పోలీస్ వారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా ర్యాలీలు లేదా సమావేశాలు నిర్వహించినట్లయితే అట్టి వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఎలాంటి ఫిర్యాదులు, అనుమానాలు ఉన్నా తక్షణమే నంబర్ 8712667343కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అల్లర్లు సృష్టించాలని చూసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రవి కాంతారావు, ఏఎస్ఐ రాంరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి, కానిస్టేబుల్ సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Ilayaraja | ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 లక్షలతో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్.!
Sobhita Dhulipala | మొదటి వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అక్కినేని కోడలు
Thudarum | మలయాళ బ్లాక్బస్టర్ ‘తుడరుమ్’ రీమేక్లో అజయ్ దేవగణ్ ?