అమరావతి : ఏపీలో నిర్వహించిన డీఎస్సీ ( DSC )- 2025 నియమకాల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ నాయకులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ ( YCP Rallies ) లతో నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి నియోజకవర్గం పులివెందులలో వైసీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన నాయకులపై పోలీసులు లాఠీఛార్జ్ ( Lathi-charge ) చేయడంతో పలువురికి గాయాలయ్యాయి .
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి , గన్నవరంలో వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. చీపురుపల్లిలో వైసీపీ నాయకుడు. మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకోవడాన్ని బొత్స మండిపడ్డారు. తాడిపత్రిలో చేపట్టిన ర్యాలీకి బయలుదేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.