మెదక్: జిల్లాలోని చేగుంటలో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ఉపాధి లభించకపోవడంతో దంపతులు ఆత్మహత్యకు చేసుకున్నారు. చేగుంట మండలంలోని పోతిన్పల్లికి చెందిన కవిత, కిశోర్ భార్యాభర్తలు. దంపతులిద్దరు నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. దీంతో చికిత్స పొందుతూ కవిత (38) నిన్న మృతిచెందింది. ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందతున్న కిశోర్ శుక్రవారం ఉదయం మరణించాడు. కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.