హైదరాబాద్, జూలై 8, (నమస్తే తెలంగాణ): వాయుసేన కోసం రూ.499 కోట్ల రూపాయల విలువైన ఆకాశ్ క్షిపణి తయారీ కాంట్రాక్టు భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)కు దక్కింది. ఈ మేరకు వాయుసేన ఎయిర్ కమాండర్ అజయ్ సింఘాల్, బీడీఎల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీఎన్ కౌల్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సంవత్సరంలో బీడీఎల్కు రూ.2,803 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి.