హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం, ఆమె స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనను కలిసిన వారందరూ ముందు జాగ్రత్త చర్యగా కరోనా ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆమె కోరారు.
రాష్ట్రంలో నిన్న కొత్తగా 10,122 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కు చేరింది. ఇందులో 3,40,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 52 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 2094కు చేరింది. మరో 69,221 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1440 కేసులు రికార్డయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..